ETV Bharat / city

8 జిల్లాల్లో ప్రత్యేక న్యాయస్థానాలు.. ఎందుకంటే?

author img

By

Published : Sep 26, 2019, 9:00 PM IST

పోక్సో చట్టం ప్రకారం బాలలపై వేధింపుల కేసుల్లో త్వరితగతిన విచారణ చేపట్టేలా ఎనిమిది జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి.

ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసిన సర్కారు

బాలలపై లైంగిక వేధింపుల కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. పోక్సో చట్టం ప్రకారం త్వరితగతిన విచారణ చేపట్టేలా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. విశాఖ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మేరకు అధికంగా ఉన్న కేసులు.. త్వరితగతిన విచారణ పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడింది.

ఇదీ చూడండి:

బాలలపై లైంగిక వేధింపుల కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. పోక్సో చట్టం ప్రకారం త్వరితగతిన విచారణ చేపట్టేలా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. విశాఖ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మేరకు అధికంగా ఉన్న కేసులు.. త్వరితగతిన విచారణ పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడింది.

ఇదీ చూడండి:

రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణం: సోమిరెడ్డి

Intro:ధ్వజస్తంభం.
జయకేతనానికి చిహ్నం ధ్వజస్తంభం. వెండివాకిలి ఎదురుగా సుమారు 15 అడుగుల దూరంలో రాతి పీఠంపై గల ఎత్తైన దారుస్తంభమే ఈ ధ్వజస్తంభం. రాతి పీఠానికి స్తంభానికి మొత్తం కింద నుండి పైవరకు బంగారుపూత పూసిన రాగిరేకు అమర్చారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా ఈ ధ్వజస్తంభంపై ఎగురవేసే గరుడపటంతోనే శ్రీస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి . ఈ గరుడపటమే సర్వలోకాల్లోని దేవదానవ యక్షకిన్నెర గంధర్వాదులకు స్వామివారిబ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం. తమిళంలో ధ్వజస్తంభాన్ని ' కొడిక్కంబం' అని అంటారు. కొడి అంటే కేతన మని అర్థం. లోపలి వస్తువును బయటికి తీసుకెళ్లాలన్నా, బయటి వస్తువు లోపలికి తీసుకురావాలన్నా ధ్వజస్తంభం సాక్షిగానే జరగాలి. ప్రదక్షిణ తప్పనిసరి.... ఊరేగింపులకు వస్తున్నప్పుడూ వెళ్తున్నప్పుడూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు కూడా ప్రదక్షిణ పూర్వకంగానే రాకపోకలు సాగిస్తారు. పూర్వం ఈ ధ్వజస్తంభం, బలిపీఠం వెండివాకిలి లోపల విమాన ప్రదక్షిణమార్గంలో గరుడుని మండపం వెనుక ఉండేవి . క్రీ.శ. 1417లో బంగారు వాకిలి ముఖమండపం నిర్మింపబడటం వల్ల వెలుపలికి మార్చారు. ఈ ధ్వజస్తంభం కొయ్యతో నిర్మించటంతో చాలామార్లు మార్చారు. చివరిసారిగా 1982లో నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు .Body:.Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.