ETV Bharat / city

కరోనాతో అస్థిరంగా 'స్థిరాస్తి' రంగం.. ప్రభుత్వ చేయూతే అండ

author img

By

Published : Jun 30, 2020, 7:07 AM IST

Updated : Jun 30, 2020, 9:20 AM IST

కరోనా దెబ్బకు కుదేలైన వాటిలో స్థిరాస్తి రంగం ఒకటి. కొనుగోలు దారులు లేక 3 నెలలుగా ప్లాట్​లు, స్థలాల క్రయవిక్రయాలు భారీగా తగ్గాయి. నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో నిర్మాణ రంగం కోలుకోవటానికి ఎంత సమయం పడుతుంది? కొనుగోలు దారుల్లో మళ్లీ నమ్మకం పెరగాలంటే... ప్రభుత్వం నిర్మాణ దారులు ఏం చేయాలి వంటి అంశాలపై నిర్మాణ, స్థిరాస్తి రంగానికి చెందిన నిపుణులతో 'ఈనాడు-ఈటీవీ భారత్' చర్చా గోష్ఠి.

real estate
కరోనాతో నిర్మాణ రంగం కుదేలు...ప్రభుత్వ చేయూతే శ్రీరామ రక్ష
కరోనాతో నిర్మాణ రంగం కుదేలు...ప్రభుత్వ చేయూతే శ్రీరామ రక్ష

కరోనా తర్వాత ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్లు, ఫ్లాట్లలో ఏదో ఒకటి చిన్నదైనా సొంతంగా సమకూర్చుకోవాలన్న ఆలోచన వారిలో మొదలైందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో రూ.25-30 లక్షల ధరల్లో కట్టే ఫ్లాట్​లకు గిరాకీ ఉంటుందని తెలిపారు. ఇప్పటికైతే నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, మళ్లీ కొనుగోలుదారుల్లో నమ్మకం కుదిరినప్పుడే గాడిన పడుతుందని స్పష్టం చేశారు. దీనికి ప్రభుత్వం చేయూత ఉండాలని ఈనాడు-ఈటీవీ భారత్ ఆన్ లైన్​లో నిర్వహించిన చర్చాగోష్ఠిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రశ్న: ప్రస్తుతం నిర్మాణ రంగం ఎదుర్కుంటున్నటువంటి సమస్యలేంటి, కరోనా అదేవిధంగా సుదీర్ఘ లాక్​డౌన్​లు ఎలాంటి ప్రభావం చూపాయని మీరనుకుంటున్నారు?

సమాధానం: 'విజయవాడతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనే సుమారు 20 వేల వరకు అపార్టుమెంట్ల పనులు నిలిచిపోయాయి. ప్రజలు ప్రస్తుతం, ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యమిస్తున్నారు. లాక్ డౌన్ సడలించాక 25-30శాతం బిల్డర్లు ధైర్యం చేసి నిర్మాణాలు ప్రారంభించినా కార్మికల కొరత వేధిస్తోంది. తీవ్ర ఇసుక కొరత ఉంది.సిమెంట్ ఉక్కు కంపెనీల యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచేశారు. ఫలితంగా ఒక్కో చదరపు అడుగుకి నిర్మాణ వ్యయం రూ.50-100 వరకు పెరిగింది. దాన్ని మేం కొనుగోలుదారులపై వేయాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ, కొనుగోలు దారులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప ఈ రంగం కోలుకోదు.

కప్ బోర్డులు, ఉడ్ వర్కు, సీలింగ్ వంటి పనులకు ఎక్కువగా ఉత్తరాధి కార్మికులపైనే ఆధారపడుతుంటాం. ఇప్పుడు వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. స్థానికంగానే మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని కరోనా తెలియజేస్తోంది. ఇసుకకీ రోబో శాండ్ లాంటి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. యంత్రాల వినియోగం పెంచాల్సిన అవసరం ఉంది.

రెరా నిబంధనల నుంచి ఏడాదిపాటు మినహాయింపు ఇవ్వాలి. వాటిలో కొన్ని కఠిన నిబంధనలున్నాయి. నిర్మాణానికి గ్యారెంటీ ఇవ్వగలం. దానిలో అమర్చిన ట్యూబ్​లైట్​లు వంటి వాటికి అయిదేళ్లు గ్యారెంటీ ఇవ్వాలంటే కష్టం. నిర్మాణ రంగానికి అవసరమైన 80శాతం పరికరాలను రిజిస్టర్ డీలర్ల నుంచే కొనాలని జీఎస్టీ నిబంధన చెబుతోంది. దిగువ శ్రేణి నగరాల్లో దాన్ని 50శాతానికి తగ్గించాలి'-సుధాకర్, క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయవాడ.

ప్రశ్న:రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రస్తుతం కొంచెం ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం కొన్ని సడలింపులిస్తే రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుందని ప్రతిపాదనలున్నాయి. ఒక వేళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాల్సి వస్తే ఎంత తగ్గిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?

సమాధానం: 'కరోనాతో ప్రజల కొనుగోళ్ల శక్తి తగ్గింది. వారిలో ఇళ్లు, స్థలాలు కొనాలన్న ఆసక్తి కనిపించటంలేదు. మళ్లీ వారిలో ఉత్సాహం రావాలంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. మార్కెట్ విలువల పెంపును కొంత కాలం వాయిదా వేయాలి. ప్రస్తుతం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి 7.5శాతం ఉంది. దాన్ని 5శాతానికి తగ్గించాలి. జీఎస్టీలోనూ కొంత వెసులుబాటు ఇవ్వాలి. ఆర్​బీఐ కూడా వడ్డీరేట్లు తగ్గించాలి. అప్పుడే లావాదేవీలు పుంజుకుని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది'-భాస్కర్​రావు, విశ్రాంత సబ్​ రిజిస్ట్రార్

ప్రశ్న: కరోనా వల్ల నిర్మాణ రంగంలో పెట్టుబడులు ఏ మేరకు స్తంభించిపోయాయి, పెరుగుతున్న వడ్డీల భారాన్ని ఎలా అధిగమించగలిగే అవకాశం ఉంది?

సమాధానం: 'విశాఖలో తారాస్థాయికి చేరుకున్న స్థిరాస్థి రంగం ప్రగతి మూడు నెలలుగా స్తంబించింది. అదే సమయంలో సిమెంట్ బస్తాకి రూ.100, ఉక్కు టన్నుకి రూ.2వేలు పెరిగింది. కార్మికుల కొరతతో కూలీ రేట్లూ 50శాతం పెరిగాయి. మహిళల పేరిట ఏమైనా కొంటే స్టాంప్​డ్యూటీలో 2009లో మినహాయింపులు ఇచ్చే వారు. అలాంటి నిర్ణయాలు మళ్లీ తీసుకోవాలి. విశాఖలో మరో 2-3నెలల్లో నిర్మాణరంగంలో వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నాం. స్థిరాస్తి రంగంలో ధరలు పడిపోతాయన్నది అపోహే. ఐటీలో 'ఇంటి నుంచే పని' విధానంతో మన నగరాల్లో ఫ్లాట్లకు గిరాకీ పెరుగుతుంది'-శ్రీ నగేష్, నరెడ్కో నార్త్​జోన్ అధ్యక్షుడు, విశాఖ

ఇవీ చూడండి..

ప్రతిధ్వని: కరోనా ప్రభావం.. స్వీయ రక్షణే కీలకం

కరోనాతో నిర్మాణ రంగం కుదేలు...ప్రభుత్వ చేయూతే శ్రీరామ రక్ష

కరోనా తర్వాత ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్లు, ఫ్లాట్లలో ఏదో ఒకటి చిన్నదైనా సొంతంగా సమకూర్చుకోవాలన్న ఆలోచన వారిలో మొదలైందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో రూ.25-30 లక్షల ధరల్లో కట్టే ఫ్లాట్​లకు గిరాకీ ఉంటుందని తెలిపారు. ఇప్పటికైతే నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, మళ్లీ కొనుగోలుదారుల్లో నమ్మకం కుదిరినప్పుడే గాడిన పడుతుందని స్పష్టం చేశారు. దీనికి ప్రభుత్వం చేయూత ఉండాలని ఈనాడు-ఈటీవీ భారత్ ఆన్ లైన్​లో నిర్వహించిన చర్చాగోష్ఠిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రశ్న: ప్రస్తుతం నిర్మాణ రంగం ఎదుర్కుంటున్నటువంటి సమస్యలేంటి, కరోనా అదేవిధంగా సుదీర్ఘ లాక్​డౌన్​లు ఎలాంటి ప్రభావం చూపాయని మీరనుకుంటున్నారు?

సమాధానం: 'విజయవాడతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనే సుమారు 20 వేల వరకు అపార్టుమెంట్ల పనులు నిలిచిపోయాయి. ప్రజలు ప్రస్తుతం, ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యమిస్తున్నారు. లాక్ డౌన్ సడలించాక 25-30శాతం బిల్డర్లు ధైర్యం చేసి నిర్మాణాలు ప్రారంభించినా కార్మికల కొరత వేధిస్తోంది. తీవ్ర ఇసుక కొరత ఉంది.సిమెంట్ ఉక్కు కంపెనీల యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచేశారు. ఫలితంగా ఒక్కో చదరపు అడుగుకి నిర్మాణ వ్యయం రూ.50-100 వరకు పెరిగింది. దాన్ని మేం కొనుగోలుదారులపై వేయాల్సి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ, కొనుగోలు దారులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప ఈ రంగం కోలుకోదు.

కప్ బోర్డులు, ఉడ్ వర్కు, సీలింగ్ వంటి పనులకు ఎక్కువగా ఉత్తరాధి కార్మికులపైనే ఆధారపడుతుంటాం. ఇప్పుడు వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. స్థానికంగానే మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని కరోనా తెలియజేస్తోంది. ఇసుకకీ రోబో శాండ్ లాంటి ప్రత్యామ్నాయం చూసుకోవాలి. యంత్రాల వినియోగం పెంచాల్సిన అవసరం ఉంది.

రెరా నిబంధనల నుంచి ఏడాదిపాటు మినహాయింపు ఇవ్వాలి. వాటిలో కొన్ని కఠిన నిబంధనలున్నాయి. నిర్మాణానికి గ్యారెంటీ ఇవ్వగలం. దానిలో అమర్చిన ట్యూబ్​లైట్​లు వంటి వాటికి అయిదేళ్లు గ్యారెంటీ ఇవ్వాలంటే కష్టం. నిర్మాణ రంగానికి అవసరమైన 80శాతం పరికరాలను రిజిస్టర్ డీలర్ల నుంచే కొనాలని జీఎస్టీ నిబంధన చెబుతోంది. దిగువ శ్రేణి నగరాల్లో దాన్ని 50శాతానికి తగ్గించాలి'-సుధాకర్, క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయవాడ.

ప్రశ్న:రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రస్తుతం కొంచెం ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం కొన్ని సడలింపులిస్తే రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుందని ప్రతిపాదనలున్నాయి. ఒక వేళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాల్సి వస్తే ఎంత తగ్గిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?

సమాధానం: 'కరోనాతో ప్రజల కొనుగోళ్ల శక్తి తగ్గింది. వారిలో ఇళ్లు, స్థలాలు కొనాలన్న ఆసక్తి కనిపించటంలేదు. మళ్లీ వారిలో ఉత్సాహం రావాలంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. మార్కెట్ విలువల పెంపును కొంత కాలం వాయిదా వేయాలి. ప్రస్తుతం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి 7.5శాతం ఉంది. దాన్ని 5శాతానికి తగ్గించాలి. జీఎస్టీలోనూ కొంత వెసులుబాటు ఇవ్వాలి. ఆర్​బీఐ కూడా వడ్డీరేట్లు తగ్గించాలి. అప్పుడే లావాదేవీలు పుంజుకుని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది'-భాస్కర్​రావు, విశ్రాంత సబ్​ రిజిస్ట్రార్

ప్రశ్న: కరోనా వల్ల నిర్మాణ రంగంలో పెట్టుబడులు ఏ మేరకు స్తంభించిపోయాయి, పెరుగుతున్న వడ్డీల భారాన్ని ఎలా అధిగమించగలిగే అవకాశం ఉంది?

సమాధానం: 'విశాఖలో తారాస్థాయికి చేరుకున్న స్థిరాస్థి రంగం ప్రగతి మూడు నెలలుగా స్తంబించింది. అదే సమయంలో సిమెంట్ బస్తాకి రూ.100, ఉక్కు టన్నుకి రూ.2వేలు పెరిగింది. కార్మికుల కొరతతో కూలీ రేట్లూ 50శాతం పెరిగాయి. మహిళల పేరిట ఏమైనా కొంటే స్టాంప్​డ్యూటీలో 2009లో మినహాయింపులు ఇచ్చే వారు. అలాంటి నిర్ణయాలు మళ్లీ తీసుకోవాలి. విశాఖలో మరో 2-3నెలల్లో నిర్మాణరంగంలో వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నాం. స్థిరాస్తి రంగంలో ధరలు పడిపోతాయన్నది అపోహే. ఐటీలో 'ఇంటి నుంచే పని' విధానంతో మన నగరాల్లో ఫ్లాట్లకు గిరాకీ పెరుగుతుంది'-శ్రీ నగేష్, నరెడ్కో నార్త్​జోన్ అధ్యక్షుడు, విశాఖ

ఇవీ చూడండి..

ప్రతిధ్వని: కరోనా ప్రభావం.. స్వీయ రక్షణే కీలకం

Last Updated : Jun 30, 2020, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.