ETV Bharat / city

సరకుల ధరల్లో.. ఇంత తేడా ఎందుకు?

అదను చూసి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనకు అమ్మకందారులు నిత్యం పదును పెడుతుంటారు. లాక్‌డౌన్‌ విధించిన మొదటి రెండు మూడు రోజులు కృత్రిమ కొరత సృష్టించి కిలో కూరగాయలను రూ. 50 నుంచి రూ.70 అమ్మేసి అమ్మో అనిపించారు. పొలాల్లో వదిలేసిన టమాటాలను కూడా రూ. 60, ఉల్లి రూ. 40 చొప్పున విక్రయించారు. కాలనీలో ఉన్న దుకాణదారుడి నుంచి సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకుడి వరకు ఇదే పద్ధతిని పాటించారు. పప్పుల వద్ద మార్కెట్‌ అధికారుల పెత్తనాలు నడవడం లేదు.

author img

By

Published : May 10, 2020, 12:46 PM IST

నివురుగప్పిన నిప్పులా నిత్యావసరం
నివురుగప్పిన నిప్పులా నిత్యావసరం
essential goods prices
నివురుగప్పిన నిప్పులా నిత్యావసరం

కరోనా వేళ తెలంగాణాలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమ్మకందారులు అదును చూసి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనకు నిత్యం పదును పెడుతున్నారు. లాక్‌డౌన్‌ మొదట్లో వినియోగదారులు పెద్దఎత్తున రావడం వల్ల ధరలను 30 శాతం పెంచేసి అమ్ముకున్నారు. తర్వాత అమ్మకాలు తగ్గిన కారణంగా.. 20 శాతానికి పరిమితమయ్యారు.

20 శాతం ఎందుకు పెరిగాయి..?

కొత్త పంటలు రాలేదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పప్పులన్నీ పాతవే. ఆ 20 శాతం ధరలను ఎందుకు పెంచారో అర్థం కాని పరిస్థితి. లాక్‌డౌన్‌కు ముందు కిలో కందిపప్పు ప్యాకెట్‌పై ఉన్న ధరకు 10 శాతం రాయితీతో రూ. 85 నుంచి రూ.95 అమ్మగా.. లాక్‌డౌన్‌ తొలినాళ్లలో రూ. 110 నుంచి రూ. 120 వరకు అమ్మేశారు.

ఇప్పుడు కూడా ఇంతే ధరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం కందిపప్పు కిలో రూ. 65- 70 వరకు మార్కెట్లో అందుబాటులో ఉండాలి. ఇదేమని అడిగితే మొదటి రకం అని కొన్ని సూపర్‌ బజార్ల నిర్వాహకులు చెబుతున్నారని పలువురు వినియోగ దారులు పేర్కొంటున్నారు.

30 శాతానికిపైగా పెరిగిన చింతపండు ధర...

లాక్‌డౌన్‌కు ముందు కిలో చింతపండు ధర రూ.180 ఉండగా.. తర్వాత దీని ధర రూ. 240 నుంచి రూ.250 వరకు పెరిగింది. ప్రస్తుతం చింతపండు ధర రూ. 220 నుంచి రూ.230 వరకు ఉంది. సూపర్‌ మార్కెట్లలో మాత్రం ధర రూ. 240కు తక్కువగా లేదు.

ఎండు కారం పొడి లాక్‌డౌన్‌కు ముందు రూ. 165 ఉండగా.. లాక్‌డౌన్‌ మధ్య కాలంలో రూ. 250 అమ్మారు. ఇప్పుడు రూ. 210 నుంచి 220 వరకు దుకాణాల్లో లభిస్తోంది. రూ. 100 లోపు ఉండే కిలో పల్లీ ఇప్పుడు రూ. 130 లకుపైగా అమ్ముతున్నారు. రైతు బజార్లలో అల్లం కిలో ధర రూ. 120 ఉండగా.. బయట మార్కెట్‌లో రూ.150 వరకు విక్రయిస్తున్నారు.

ఇదీ చూడండి:

ఇళ్ల ముందుకే బియ్యం.. కళ్ల ఎదుటే తూకం

essential goods prices
నివురుగప్పిన నిప్పులా నిత్యావసరం

కరోనా వేళ తెలంగాణాలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమ్మకందారులు అదును చూసి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనకు నిత్యం పదును పెడుతున్నారు. లాక్‌డౌన్‌ మొదట్లో వినియోగదారులు పెద్దఎత్తున రావడం వల్ల ధరలను 30 శాతం పెంచేసి అమ్ముకున్నారు. తర్వాత అమ్మకాలు తగ్గిన కారణంగా.. 20 శాతానికి పరిమితమయ్యారు.

20 శాతం ఎందుకు పెరిగాయి..?

కొత్త పంటలు రాలేదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పప్పులన్నీ పాతవే. ఆ 20 శాతం ధరలను ఎందుకు పెంచారో అర్థం కాని పరిస్థితి. లాక్‌డౌన్‌కు ముందు కిలో కందిపప్పు ప్యాకెట్‌పై ఉన్న ధరకు 10 శాతం రాయితీతో రూ. 85 నుంచి రూ.95 అమ్మగా.. లాక్‌డౌన్‌ తొలినాళ్లలో రూ. 110 నుంచి రూ. 120 వరకు అమ్మేశారు.

ఇప్పుడు కూడా ఇంతే ధరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం కందిపప్పు కిలో రూ. 65- 70 వరకు మార్కెట్లో అందుబాటులో ఉండాలి. ఇదేమని అడిగితే మొదటి రకం అని కొన్ని సూపర్‌ బజార్ల నిర్వాహకులు చెబుతున్నారని పలువురు వినియోగ దారులు పేర్కొంటున్నారు.

30 శాతానికిపైగా పెరిగిన చింతపండు ధర...

లాక్‌డౌన్‌కు ముందు కిలో చింతపండు ధర రూ.180 ఉండగా.. తర్వాత దీని ధర రూ. 240 నుంచి రూ.250 వరకు పెరిగింది. ప్రస్తుతం చింతపండు ధర రూ. 220 నుంచి రూ.230 వరకు ఉంది. సూపర్‌ మార్కెట్లలో మాత్రం ధర రూ. 240కు తక్కువగా లేదు.

ఎండు కారం పొడి లాక్‌డౌన్‌కు ముందు రూ. 165 ఉండగా.. లాక్‌డౌన్‌ మధ్య కాలంలో రూ. 250 అమ్మారు. ఇప్పుడు రూ. 210 నుంచి 220 వరకు దుకాణాల్లో లభిస్తోంది. రూ. 100 లోపు ఉండే కిలో పల్లీ ఇప్పుడు రూ. 130 లకుపైగా అమ్ముతున్నారు. రైతు బజార్లలో అల్లం కిలో ధర రూ. 120 ఉండగా.. బయట మార్కెట్‌లో రూ.150 వరకు విక్రయిస్తున్నారు.

ఇదీ చూడండి:

ఇళ్ల ముందుకే బియ్యం.. కళ్ల ఎదుటే తూకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.