తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న అనుచరులతో కలిసి ఈటల కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో.... ఈటల రాజేందర్తో పాటు మాజీఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ భాజపాలో చేరనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను అందించేందుకు స్పీకర్ను ఈటల రాజేందర్ సమయం కోరగా.... సభాపతి ఇవ్వకపోవడంతో ఈ మెయిల్ ద్వారా పంపిస్తారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు