ETV Bharat / city

'మాతృ భాషతోనే సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లుతాయి'

author img

By

Published : Aug 29, 2021, 2:07 PM IST

తెలుగు వాడుక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం తెలుగువారి సౌభాగ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​​ అన్నారు. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషగా మార్చి అందరికీ చేరువయ్యేలా చేసిన ఘనత గిడుగు వంటి మహానుభావులదైతే .. ఈనాటి పాలకులు తెలుగును కనుమరుగు చేసే అనాలోచిత చర్యలకు ఉపక్రమిస్తున్నారన్నారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్

తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 'సుందర తెలుంగు'..తమిళ కవి బ్రహ్మ సుబ్రహ్మణ్య భారతి నోట జాలువారిన మాట అని. 'దేశ భాషలందు తెలుగు లెస్స' శ్రీకృష్ణ దేవరాయలు ఘంటం నుంచి జాలువారిన అక్షరాలని ఆయన పేర్కొన్నారు. కస్తూరి పరిమళాల ఓలే మధుర భాష తెలుగుగా నండూరి వారు ప్రకటిస్తే.... ఇటాలియన్ అఫ్ ఈస్ట్.. అజంత భాష.. అమర భాష.. ఇంతటి ఘన కీర్తి మన తెలుగు భాషకు ఉందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. భాష దినోత్సవం సందర్భంగా తెలుగు వారికి తన పక్షాన, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వాడుక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం తెలుగువారి సౌభాగ్యమని పవన్​ అన్నారు. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషగా మార్చి అందరికీ చేరువయ్యేలా చేసిన ఘనత గిడుగు వంటి మహానుభావులదైతే .. ఈనాటి పాలకులు తెలుగును కనుమరుగు చేసే అనాలోచిత చర్యలకు ఉపక్రమిస్తున్నారన్నారు.

'కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక పోయింది' అనే రీతిలో వ్యవహరిస్తున్నారని జనసేన అధినేత ఆరోపించారు.. ఓట్ల వ్యామోహంలో వైకాపా నాయకులు కొట్టుకుపోతున్నారని విమర్శించారు. తెలుగు భాషకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే గుండె బరువెక్కక మానదని ఆవేదన చెందారు.

ఒకప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య 27 శాతం మించి లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో అయిదు దశాబ్దాలలో తెలుగు అంతరించిపోతున్న భాషల పట్టికలో చేరిపోయే ప్రమాదం ఉందని తెలుగు భాషాభిమానులు ఆవేదన చెందుతున్నారన్నారు. మాతృ భాషతోనే సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లుతాయన్న పెద్దల మాటలను విస్మరించరాదని హితవు పలికారు. భాష అంతరించిపోతే జాతి మొత్తం అంతరించిపోతుందన్నారు. మన అమ్మ భాషను బతికించుకోడానికి తెలుగు వారందరూ నడుంకట్టాలని పిలుపునిచ్చారు. పాలకులు ఏదో చేస్తారులే అన్న భావం విడనాడాలన్నారు. భాషాభిమానులు, స్వచ్చంధ సంస్థలు ముఖ్య భూమిక పోషించాలని.. భాషాభ్యున్నతికి చర్చా గోష్టులు, సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉందన్నారు.. భాషాపరమైన గ్రంథాల ముద్రణకు ముందుకు రావాలని.. ఊరికో తెలుగు భాషా సంఘం ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించినా వారికి తెలుగు నేర్పించడంలో తల్లిదండ్రులు శ్రద్ధవహించాలని విజ్ఞప్తి చేశారు. భాషా పరిరక్షణకు జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుందని తెలిపారు. తెలుగును బతికించుకుందాం.. తెలుగువారమని సగర్వంగా ప్రకటించుకుందాని పవన్‌ అన్నారు.

ఇదీ చదవండి: తెలుగు, సంస్కృతానికి తేడా తెలియని పాలన ఇది

తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 'సుందర తెలుంగు'..తమిళ కవి బ్రహ్మ సుబ్రహ్మణ్య భారతి నోట జాలువారిన మాట అని. 'దేశ భాషలందు తెలుగు లెస్స' శ్రీకృష్ణ దేవరాయలు ఘంటం నుంచి జాలువారిన అక్షరాలని ఆయన పేర్కొన్నారు. కస్తూరి పరిమళాల ఓలే మధుర భాష తెలుగుగా నండూరి వారు ప్రకటిస్తే.... ఇటాలియన్ అఫ్ ఈస్ట్.. అజంత భాష.. అమర భాష.. ఇంతటి ఘన కీర్తి మన తెలుగు భాషకు ఉందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. భాష దినోత్సవం సందర్భంగా తెలుగు వారికి తన పక్షాన, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వాడుక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం తెలుగువారి సౌభాగ్యమని పవన్​ అన్నారు. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషగా మార్చి అందరికీ చేరువయ్యేలా చేసిన ఘనత గిడుగు వంటి మహానుభావులదైతే .. ఈనాటి పాలకులు తెలుగును కనుమరుగు చేసే అనాలోచిత చర్యలకు ఉపక్రమిస్తున్నారన్నారు.

'కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక పోయింది' అనే రీతిలో వ్యవహరిస్తున్నారని జనసేన అధినేత ఆరోపించారు.. ఓట్ల వ్యామోహంలో వైకాపా నాయకులు కొట్టుకుపోతున్నారని విమర్శించారు. తెలుగు భాషకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే గుండె బరువెక్కక మానదని ఆవేదన చెందారు.

ఒకప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య 27 శాతం మించి లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో అయిదు దశాబ్దాలలో తెలుగు అంతరించిపోతున్న భాషల పట్టికలో చేరిపోయే ప్రమాదం ఉందని తెలుగు భాషాభిమానులు ఆవేదన చెందుతున్నారన్నారు. మాతృ భాషతోనే సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లుతాయన్న పెద్దల మాటలను విస్మరించరాదని హితవు పలికారు. భాష అంతరించిపోతే జాతి మొత్తం అంతరించిపోతుందన్నారు. మన అమ్మ భాషను బతికించుకోడానికి తెలుగు వారందరూ నడుంకట్టాలని పిలుపునిచ్చారు. పాలకులు ఏదో చేస్తారులే అన్న భావం విడనాడాలన్నారు. భాషాభిమానులు, స్వచ్చంధ సంస్థలు ముఖ్య భూమిక పోషించాలని.. భాషాభ్యున్నతికి చర్చా గోష్టులు, సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉందన్నారు.. భాషాపరమైన గ్రంథాల ముద్రణకు ముందుకు రావాలని.. ఊరికో తెలుగు భాషా సంఘం ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించినా వారికి తెలుగు నేర్పించడంలో తల్లిదండ్రులు శ్రద్ధవహించాలని విజ్ఞప్తి చేశారు. భాషా పరిరక్షణకు జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుందని తెలిపారు. తెలుగును బతికించుకుందాం.. తెలుగువారమని సగర్వంగా ప్రకటించుకుందాని పవన్‌ అన్నారు.

ఇదీ చదవండి: తెలుగు, సంస్కృతానికి తేడా తెలియని పాలన ఇది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.