ETV Bharat / city

ఈనాడు సాయం.. మాన్పింది గాయం

author img

By

Published : Feb 8, 2020, 11:56 PM IST

సర్వేజనా సుఖినోభవంతు... అని కోరుకునే సమాజం మనది. సహాయ నిధి ఏర్పాటు కాగానే ఈనాడు పాఠకులు చూపిన ఔదార్యమే ఇందుకు నిదర్శనం. మన రాష్ట్రం వాళ్లు కాదు కదా..! వారికెందుకు సాయం చేయాలి అన్న ఆలోచనలే లేకుండా...సాటి మనుషులుగా వాళ్లకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత నిర్వర్తించారు. ఏడాదిన్నర క్రితం కేరళలో వచ్చిన వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కట్టుకున్న గూడు కళ్లముందే నీటమునిగిపోయి..నిస్సహాస్థితిలో ఉన్న బాధితులకు అండగా నిలిచింది ఈనాడు. నాణ్యతలో రాజీ లేకుండా 121 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఆ నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారులంతా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

contribution-of-eenadu-readers-to-help-kerala-flood-victims
contribution-of-eenadu-readers-to-help-kerala-flood-victims
బాధితులకు అండగా నిలిచిన ఈనాడు

నాలుగు దశాబ్దాలుగా దేశంలో ఏ మూల ప్రకృతి కన్నెర్రజేసినా.. ఈనాడు పిలుపునివ్వటమే ఆలస్యం...బాధితులను ఆదుకోవటానికి మేమున్నామంటూ చేయందించారు పాఠకులు. విశాల హృదయంతో వారిచ్చిన నిధులే ఇళ్లుగా..బడులుగా మారి.. మనసారా వారు చేసిన సాయానికి సార్థకత చేకూర్చాయి. కేరళ విషయంలోనూ అంతే. కిడ్డీబ్యాంకుల్లో దాచుకున్న డబ్బు తెచ్చిచ్చిన చిన్నారుల్నీ, పింఛను సొమ్ము నుంచి కూడా కొంత మొత్తం తీసి ఇచ్చిన వృద్ధుల్నీ... అందరినీ కదిలించింది...కేరళ ప్రజల కష్టమే.

సంప్రదింపులు, చర్చల తర్వాతే కార్యరూపం...

ప్రజలిచ్చే సొమ్ముకు కచ్చితమైన లెక్క ఉండాలి. లేదంటే వారు నమ్మకంతో చేసే సాయానికి విలువ ఉండదు. అందుకే ఏ రోజుకారోజు సహాయనిధికి ఎవరెవరు ఎంతిచ్చారన్నది పత్రికాముఖం గానే ప్రచురించింది..ఈనాడు. నిధులతో ఏం చేయాలి..? ఎలా ఖర్చు చేస్తే బాగుంటుంది? అన్నది బాధిత ప్రాంత అధికారులతో, నాయకులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంది. స్థలమూ, లబ్ధిదారుల ఎంపికా వారి సూచన మేరకే. తరవాత...ఆ పథకానికి కార్యరూపమిచ్చే బాధ్యతను ప్రతిష్ఠాత్మక సంస్థలతో పంచుకుంది.

ప్రతి అడుగులో భాగస్వామ్యం

ఈ క్రమంలో రామకృష్ణ మఠం, స్వామినారాయణ్ సంస్థ, కుటుంబశ్రీలాంటి సంస్థల సహకారం మరువ లేనిది. అలాగని డబ్బిచ్చి చేతులు దులుపుకోలేదు. నిర్మాణాలు పూర్తై, లబ్ధిదారులకు అందజేసి, నిర్వహణ బాధ్యతను స్థానిక గ్రామపంచాయతీలకు అప్పజెప్పే వరకూ ఈనాడు పాత్ర ఉంది. ప్రతి రూపాయి ప్రతిఫలం కనిపించేలా ఈ పథకాల కార్యాచరణ జరగటం ముఖ్యమైన అంశం. పై ఖర్చులన్నింటినీ సంస్థే భరిస్తూ సహాయనిధిని పొదుపుగా, అవకాశం ఉన్న చోటల్లా ఖర్చు తగ్గించుకుంటూ చేయటం వల్లే ఇది సాధ్యమైంది.

అడుగుపడింది నాడే..

అది 1976 వ సంవత్సరం..ఒకే ఏడాదిలో దివిసీమ ప్రాంతంలో వరుసగా 3 తుపాన్లు విరుచుకుపడ్డాయి. అప్పుడే తొలిసారిగా తుపాను సహాయనిధిని ప్రారంభించింది ఈనాడు. దానికి విశేష స్పందన లభించింది.

⦁ పాఠకుల నుంచి దాదాపు రూ.65 వేలు విరాళాల రూపంలో రాగా..సీఎం సహాయనిధికి అందించారు.

⦁ 1977నవంబరులో కృష్ణాజిల్లా పాలకయతిప్ప గ్రామాన్ని వరదలు ముంచేశాయి . అప్పుడు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో వరదలకు తట్టుకునేలా దాదాపు 112 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది ఈనాడు. ఇళ్లు కట్టగా మిగిలిన డబ్బుతో పక్కనే కృష్ణాపురం అనే ఊళ్లో మరో 22మందికి నీడ కల్పించారు.

⦁ 1996లో కోస్తాపై పెనుతుపాను విరుచుకుపడినప్పుడు మరోసారి బాధితులకు అండగా నిలిచింది . పాతిక లక్షలతో తుపాను సహాయ నిధిని ప్రారంభించగా పాఠకుల విరాళాలతో అది కోటి రూపాయలకు చేరుకుంది. దీంతో 42 సూర్య భవనాలను తీరప్రాంతంలో పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడేలా అందించింది.

ఒడిశా, గుజరాత్​లోనూ పక్కా ఇళ్ల నిర్మాణం

ఒడిశా, గుజరాత్​లోనూ విపత్తులు వచ్చినప్పుడు ఈనాడు ముందుకొచ్చి పక్కా ఇళ్లు నిర్మించింది.

⦁ 1999లో ఒడిశాను చెల్లాచెదురు చేసింది సూపర్ సైక్లోన్‌ .అప్పుడు కూడా ముందుకు వచ్చిన ఈనాడు పక్కా ఇళ్ల నిర్మించింది .జగత్‌సింగ్ పుర్ జిల్లాలో 50 లక్షలతో 60 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది.

⦁ ఇక 2001లో గుజరాత్‌లో వేలమందిని బలిగొన్న భూకంపంలో తనవంతు సాయం అందించింది. సహాయనిధితోపాటు పాఠకుల విరాళాలను పోగు చేసి దాదాపు 2.2 కోట్ల రూపాయలతో కచ్ జిల్లాలో.. స్వామి నారాయణ్ సంస్థ సహకారంతో 104 ఇళ్లు సమకూర్చింది.

⦁ 2004లో దేశ దక్షిణ తీర ప్రాంతంలో సునామీ ముంచెత్తినప్పుడు తీవ్రంగా నష్టపోయిన కడలూరు, నాగ పట్టణం జిల్లాల్లో.. రెండున్నర కోట్లు వెచ్చించి రామకృష్ణ మఠం సహకారంతో మత్స్యకారులకు 164 ఇళ్లు అందించింది.

ఇక 2009లో కృష్ణా, తుంగభద్ర నదులకు వరదలు వచ్చినప్పుడు రాజోలిలో చేనేత కార్మికులు దిక్కులేని వారయ్యారు. ఇక్కడ దాదాపు 1100 చేనేత కుటుంబాలకు మగ్గాలను ఉచితంగా అందజేసింది. 2014లో హుద్ హుద్ బాధితులకోసం 3 కోట్ల సహాయనిధితోపాటు పాఠకుల విరాళాలు 3 కోట్లు కలిపి విశాఖ జిల్లాలోని తంతడి, వాడపాలెం ప్రాంతాల్లో 80 కొత్త ఇళ్లు నిర్మాణం తోపాటు దెబ్బతిన్న మరికొన్ని ఇళ్లకు మరమ్మతులు చేసి ఇచ్చింది ఈనాడు.

ఇవీ చూడండి:

పక్కా ప్రణాళిక.. 8 నెలలు.. 121 ఇళ్లు..!

బాధితులకు అండగా నిలిచిన ఈనాడు

నాలుగు దశాబ్దాలుగా దేశంలో ఏ మూల ప్రకృతి కన్నెర్రజేసినా.. ఈనాడు పిలుపునివ్వటమే ఆలస్యం...బాధితులను ఆదుకోవటానికి మేమున్నామంటూ చేయందించారు పాఠకులు. విశాల హృదయంతో వారిచ్చిన నిధులే ఇళ్లుగా..బడులుగా మారి.. మనసారా వారు చేసిన సాయానికి సార్థకత చేకూర్చాయి. కేరళ విషయంలోనూ అంతే. కిడ్డీబ్యాంకుల్లో దాచుకున్న డబ్బు తెచ్చిచ్చిన చిన్నారుల్నీ, పింఛను సొమ్ము నుంచి కూడా కొంత మొత్తం తీసి ఇచ్చిన వృద్ధుల్నీ... అందరినీ కదిలించింది...కేరళ ప్రజల కష్టమే.

సంప్రదింపులు, చర్చల తర్వాతే కార్యరూపం...

ప్రజలిచ్చే సొమ్ముకు కచ్చితమైన లెక్క ఉండాలి. లేదంటే వారు నమ్మకంతో చేసే సాయానికి విలువ ఉండదు. అందుకే ఏ రోజుకారోజు సహాయనిధికి ఎవరెవరు ఎంతిచ్చారన్నది పత్రికాముఖం గానే ప్రచురించింది..ఈనాడు. నిధులతో ఏం చేయాలి..? ఎలా ఖర్చు చేస్తే బాగుంటుంది? అన్నది బాధిత ప్రాంత అధికారులతో, నాయకులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంది. స్థలమూ, లబ్ధిదారుల ఎంపికా వారి సూచన మేరకే. తరవాత...ఆ పథకానికి కార్యరూపమిచ్చే బాధ్యతను ప్రతిష్ఠాత్మక సంస్థలతో పంచుకుంది.

ప్రతి అడుగులో భాగస్వామ్యం

ఈ క్రమంలో రామకృష్ణ మఠం, స్వామినారాయణ్ సంస్థ, కుటుంబశ్రీలాంటి సంస్థల సహకారం మరువ లేనిది. అలాగని డబ్బిచ్చి చేతులు దులుపుకోలేదు. నిర్మాణాలు పూర్తై, లబ్ధిదారులకు అందజేసి, నిర్వహణ బాధ్యతను స్థానిక గ్రామపంచాయతీలకు అప్పజెప్పే వరకూ ఈనాడు పాత్ర ఉంది. ప్రతి రూపాయి ప్రతిఫలం కనిపించేలా ఈ పథకాల కార్యాచరణ జరగటం ముఖ్యమైన అంశం. పై ఖర్చులన్నింటినీ సంస్థే భరిస్తూ సహాయనిధిని పొదుపుగా, అవకాశం ఉన్న చోటల్లా ఖర్చు తగ్గించుకుంటూ చేయటం వల్లే ఇది సాధ్యమైంది.

అడుగుపడింది నాడే..

అది 1976 వ సంవత్సరం..ఒకే ఏడాదిలో దివిసీమ ప్రాంతంలో వరుసగా 3 తుపాన్లు విరుచుకుపడ్డాయి. అప్పుడే తొలిసారిగా తుపాను సహాయనిధిని ప్రారంభించింది ఈనాడు. దానికి విశేష స్పందన లభించింది.

⦁ పాఠకుల నుంచి దాదాపు రూ.65 వేలు విరాళాల రూపంలో రాగా..సీఎం సహాయనిధికి అందించారు.

⦁ 1977నవంబరులో కృష్ణాజిల్లా పాలకయతిప్ప గ్రామాన్ని వరదలు ముంచేశాయి . అప్పుడు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో వరదలకు తట్టుకునేలా దాదాపు 112 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది ఈనాడు. ఇళ్లు కట్టగా మిగిలిన డబ్బుతో పక్కనే కృష్ణాపురం అనే ఊళ్లో మరో 22మందికి నీడ కల్పించారు.

⦁ 1996లో కోస్తాపై పెనుతుపాను విరుచుకుపడినప్పుడు మరోసారి బాధితులకు అండగా నిలిచింది . పాతిక లక్షలతో తుపాను సహాయ నిధిని ప్రారంభించగా పాఠకుల విరాళాలతో అది కోటి రూపాయలకు చేరుకుంది. దీంతో 42 సూర్య భవనాలను తీరప్రాంతంలో పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడేలా అందించింది.

ఒడిశా, గుజరాత్​లోనూ పక్కా ఇళ్ల నిర్మాణం

ఒడిశా, గుజరాత్​లోనూ విపత్తులు వచ్చినప్పుడు ఈనాడు ముందుకొచ్చి పక్కా ఇళ్లు నిర్మించింది.

⦁ 1999లో ఒడిశాను చెల్లాచెదురు చేసింది సూపర్ సైక్లోన్‌ .అప్పుడు కూడా ముందుకు వచ్చిన ఈనాడు పక్కా ఇళ్ల నిర్మించింది .జగత్‌సింగ్ పుర్ జిల్లాలో 50 లక్షలతో 60 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది.

⦁ ఇక 2001లో గుజరాత్‌లో వేలమందిని బలిగొన్న భూకంపంలో తనవంతు సాయం అందించింది. సహాయనిధితోపాటు పాఠకుల విరాళాలను పోగు చేసి దాదాపు 2.2 కోట్ల రూపాయలతో కచ్ జిల్లాలో.. స్వామి నారాయణ్ సంస్థ సహకారంతో 104 ఇళ్లు సమకూర్చింది.

⦁ 2004లో దేశ దక్షిణ తీర ప్రాంతంలో సునామీ ముంచెత్తినప్పుడు తీవ్రంగా నష్టపోయిన కడలూరు, నాగ పట్టణం జిల్లాల్లో.. రెండున్నర కోట్లు వెచ్చించి రామకృష్ణ మఠం సహకారంతో మత్స్యకారులకు 164 ఇళ్లు అందించింది.

ఇక 2009లో కృష్ణా, తుంగభద్ర నదులకు వరదలు వచ్చినప్పుడు రాజోలిలో చేనేత కార్మికులు దిక్కులేని వారయ్యారు. ఇక్కడ దాదాపు 1100 చేనేత కుటుంబాలకు మగ్గాలను ఉచితంగా అందజేసింది. 2014లో హుద్ హుద్ బాధితులకోసం 3 కోట్ల సహాయనిధితోపాటు పాఠకుల విరాళాలు 3 కోట్లు కలిపి విశాఖ జిల్లాలోని తంతడి, వాడపాలెం ప్రాంతాల్లో 80 కొత్త ఇళ్లు నిర్మాణం తోపాటు దెబ్బతిన్న మరికొన్ని ఇళ్లకు మరమ్మతులు చేసి ఇచ్చింది ఈనాడు.

ఇవీ చూడండి:

పక్కా ప్రణాళిక.. 8 నెలలు.. 121 ఇళ్లు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.