ETV Bharat / city

ట్రైనీ డిప్యూటీ కలెక్టర్​గా కల్నల్​ సంతోశ్​బాబు సతీమణి

author img

By

Published : Nov 2, 2020, 2:15 PM IST

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్​గా కల్నల్​ సంతోశ్​ బాబు సతీమణి సంతోషినిని రాష్ట్ర ప్రభుత్వం అటాచ్​ చేసింది. కలెక్టర్​ అనితా రామచంద్రన్​కు ఇవాళ ఆమె రిపోర్ట్ చేశారు.

santhoshi as trainee deputy collector
ట్రైనీ డిప్యూటీ కలెక్టర్​గా కల్నల్​ సంతోశ్​బాబు సతీమణి

చైనా-భారత్ సరిహద్దుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు వీరమరణం పొందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. సంతోశ్ బాబు సేవలకు గుర్తింపుగా.. అతని సతీమణికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

ఆ హామీ మేరకు యదాద్రి భువనగిరి జిల్లాకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్​గా అటాచ్​ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఆమె విధుల్లో చేరారు. జనవరి వరకు సంతోషిని విధులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు.

చైనా-భారత్ సరిహద్దుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు వీరమరణం పొందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. సంతోశ్ బాబు సేవలకు గుర్తింపుగా.. అతని సతీమణికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

ఆ హామీ మేరకు యదాద్రి భువనగిరి జిల్లాకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్​గా అటాచ్​ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఆమె విధుల్లో చేరారు. జనవరి వరకు సంతోషిని విధులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు.

ఇదీ చదవండి:

'12 ఛార్జీషీట్ల మాఫీ కోసం.. 12వేల కోట్ల నష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.