ETV Bharat / city

కరోనా నివారణ చర్యలపై మంత్రులతో సీఎం సమీక్ష

author img

By

Published : Apr 3, 2020, 12:10 PM IST

Updated : Apr 3, 2020, 4:09 PM IST

రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్​.. మంత్రులు, అధికారులతో చర్చించారు. లాక్​డౌన్​ అమలుపై పోలీసులకు సీఎం పలు సూచనలు చేశారు.

కరోనా నివారణ చర్యలపై మంత్రులతో సీఎం సమీక్ష
కరోనా నివారణ చర్యలపై మంత్రులతో సీఎం సమీక్ష

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్​ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో కరోనా నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స, మోపిదేవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్​ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ల్యాబ్​లు, వాటి సామర్థ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ అమలుపై పోలీసులకు పలు సూచనలు చేశారు.

దుకాణాల వద్ద మార్కింగ్​ తప్పనిసరి

రేషన్​, నిత్యావసరాల దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్​ అధికారులను ఆదేశించారు. మార్కింగ్స్​, ధరల పట్టిక పెట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని ఆదేశించిన ఆయన.. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్​ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో కరోనా నివారణ చర్యలపై చర్చించారు. సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స, మోపిదేవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్​ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ల్యాబ్​లు, వాటి సామర్థ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ అమలుపై పోలీసులకు పలు సూచనలు చేశారు.

దుకాణాల వద్ద మార్కింగ్​ తప్పనిసరి

రేషన్​, నిత్యావసరాల దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్​ అధికారులను ఆదేశించారు. మార్కింగ్స్​, ధరల పట్టిక పెట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని ఆదేశించిన ఆయన.. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.

ఇదీ చూడండి:

బియ్యం కార్డులకే ఆర్థిక సాయం

Last Updated : Apr 3, 2020, 4:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.