ETV Bharat / city

యాస్ తుపాన్..​ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ - ap cm jagan

యాస్ తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

yaas cyclone effect
cm jagan review on yaas cyclone effect
author img

By

Published : May 25, 2021, 4:24 PM IST

తుపాను ప్రభావిత జిల్లాల(విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాస్ తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప పెద్దగా ప్రభావం కన్పించలేదని తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్‌ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆక్సిజన్‌ కొరత రాకుండా జనరేటర్లు, డీజిల్‌ అన్నీ సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి చెప్పారు.

తుపాను ప్రభావిత జిల్లాల(విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాస్ తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప పెద్దగా ప్రభావం కన్పించలేదని తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్‌ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆక్సిజన్‌ కొరత రాకుండా జనరేటర్లు, డీజిల్‌ అన్నీ సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి చెప్పారు.

ఇదీ చదవండి

వలస జీవితాలు.. సీలేరు నదిలో గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.