ETV Bharat / city

'పట్టణాల్లో అభివృద్ధి పనులు ఎక్కడివరకు వచ్చాయి?'

author img

By

Published : Jan 6, 2020, 10:20 PM IST

పట్టణాలు, నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు.

Cm jagan review on development programs in cities
పట్టణాలు, నగరాల అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష
పట్టణాలు, నగరాల అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష

పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్‌ సమీక్ష చేశారు. వివిధ పథకాల కింద అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. విశాఖకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పోలవరం నుంచి నేరుగా భూగర్భ పైప్‌లైన్‌ ద్వారా తాగునీటి సరఫరాకు చేయాలని అధికారులకు సూచించారు.

ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ ట్రామ్ రవాణా

విశాఖ మెట్రో రైలుపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు ట్రామ్‌ తరహా ప్రజారవాణా ఆలోచన చేయాలని అన్నారు. ఈ అంశంపై డీపీఆర్‌ తయారీకి త్వరలో కన్సల్టెన్సీ నియామకం చేపట్టాలని చెప్పారు. విశాఖలో లక్షన్నర మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

గృహ నిర్మాణాల్లో రివర్స్ టెండరింగ్.. రూ.303 కోట్లు ఆదా

పట్టణాల్లో గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఇప్పటివరకూ 48 వేల 608 హౌసింగ్‌ యూనిట్లకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రివర్స్‌ టెండరింగ్ ద్వారా రూ.303 కోట్లు మిగిలినట్లు అధికారులు వివరించారు. మిగిలిన యూనిట్లకు త్వరలో రివర్స్‌ టెండరింగ్‌ పూర్తిచేస్తామన్నారు. స్పెసిఫికేషన్స్‌ మార్చకుండా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు. పట్టణ గృహనిర్మాణంలో డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి పనులను దశల వారీగా, ప్రాధాన్యత ప్రకారం మున్సిపాలిటీల్లో చేపట్టాలన్నారు. జనాభాను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని సీఎం సూచించారు.

ఆ మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారి

డీ శాలినేషన్‌ చేసిన నీటినే పరిశ్రమలు వాడేట్టుగా చూడాలన్న సీఎం... శుద్ధిచేసిన మురుగునీటిని పరిశ్రమలు వాడుకునేందుకు ప్రయత్నించాలన్నారు. తాడేపల్లి, మంగళగిరి, పులివెందుల మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. ఈ మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

తాడేపల్లి, మంగళగిరిలో మోడల్ కాలనీలు

తాడేపల్లి, మంగళగిరిల్లో 10,794 మందిని ఇళ్లపట్టాల లబ్ధిదారులను గుర్తించామని అధికారులు... సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తాడేపల్లి, మంగళగిరిలో మోడల్‌ కాలనీలు కట్టాలని సీఎం ఆదేశించారు. ముంపునకు గురికాకుండా విజయవాడలో రిటైనింగ్‌ వాల్‌ పూర్తిచేయాలన్న సీఎం... వీటి పనులు వీలైనంత వేగంగా చేపట్టాలన్నారు.

కుప్పం పట్టణానికి మున్సిపాలిటీ హోదా

లంచాలు లేకుండా బిల్డింగ్‌ ప్లాన్స్‌ ఇచ్చే పరిస్థితి ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతికి చోటు లేకుండా బిల్డింగ్‌ ప్లాన్స్‌ ప్రజలకు అందాలని చెప్పారు. అవినీతి లేని వ్యవస్థను తీసుకువస్తే అధికారులను సన్మానిస్తామన్నారు. కమలాపురం, కుప్పంలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా పూర్తయ్యేలా సన్నద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి:

ఈ హరిత సంద్రం మీ కంటికి ఎడారిగా ఉందా?: చంద్రబాబు

పట్టణాలు, నగరాల అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష

పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్‌ సమీక్ష చేశారు. వివిధ పథకాల కింద అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. విశాఖ, కాకినాడ, తిరుపతి నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. విశాఖకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పోలవరం నుంచి నేరుగా భూగర్భ పైప్‌లైన్‌ ద్వారా తాగునీటి సరఫరాకు చేయాలని అధికారులకు సూచించారు.

ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ ట్రామ్ రవాణా

విశాఖ మెట్రో రైలుపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు ట్రామ్‌ తరహా ప్రజారవాణా ఆలోచన చేయాలని అన్నారు. ఈ అంశంపై డీపీఆర్‌ తయారీకి త్వరలో కన్సల్టెన్సీ నియామకం చేపట్టాలని చెప్పారు. విశాఖలో లక్షన్నర మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

గృహ నిర్మాణాల్లో రివర్స్ టెండరింగ్.. రూ.303 కోట్లు ఆదా

పట్టణాల్లో గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఇప్పటివరకూ 48 వేల 608 హౌసింగ్‌ యూనిట్లకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రివర్స్‌ టెండరింగ్ ద్వారా రూ.303 కోట్లు మిగిలినట్లు అధికారులు వివరించారు. మిగిలిన యూనిట్లకు త్వరలో రివర్స్‌ టెండరింగ్‌ పూర్తిచేస్తామన్నారు. స్పెసిఫికేషన్స్‌ మార్చకుండా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు. పట్టణ గృహనిర్మాణంలో డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి పనులను దశల వారీగా, ప్రాధాన్యత ప్రకారం మున్సిపాలిటీల్లో చేపట్టాలన్నారు. జనాభాను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని సీఎం సూచించారు.

ఆ మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారి

డీ శాలినేషన్‌ చేసిన నీటినే పరిశ్రమలు వాడేట్టుగా చూడాలన్న సీఎం... శుద్ధిచేసిన మురుగునీటిని పరిశ్రమలు వాడుకునేందుకు ప్రయత్నించాలన్నారు. తాడేపల్లి, మంగళగిరి, పులివెందుల మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. ఈ మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

తాడేపల్లి, మంగళగిరిలో మోడల్ కాలనీలు

తాడేపల్లి, మంగళగిరిల్లో 10,794 మందిని ఇళ్లపట్టాల లబ్ధిదారులను గుర్తించామని అధికారులు... సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తాడేపల్లి, మంగళగిరిలో మోడల్‌ కాలనీలు కట్టాలని సీఎం ఆదేశించారు. ముంపునకు గురికాకుండా విజయవాడలో రిటైనింగ్‌ వాల్‌ పూర్తిచేయాలన్న సీఎం... వీటి పనులు వీలైనంత వేగంగా చేపట్టాలన్నారు.

కుప్పం పట్టణానికి మున్సిపాలిటీ హోదా

లంచాలు లేకుండా బిల్డింగ్‌ ప్లాన్స్‌ ఇచ్చే పరిస్థితి ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతికి చోటు లేకుండా బిల్డింగ్‌ ప్లాన్స్‌ ప్రజలకు అందాలని చెప్పారు. అవినీతి లేని వ్యవస్థను తీసుకువస్తే అధికారులను సన్మానిస్తామన్నారు. కమలాపురం, కుప్పంలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా పూర్తయ్యేలా సన్నద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి:

ఈ హరిత సంద్రం మీ కంటికి ఎడారిగా ఉందా?: చంద్రబాబు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.