ప్రజాసమస్యలపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి రాజీలేని పోరాటం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కొనియాడారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేశానని పేర్కొన్నారు. జైపాల్రెడ్డిలో వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి ఎక్కువని కీర్తించారు. ఏ విషయం చెప్పాలన్నా ముక్కుసూటిగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. జైపాల్రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఇదీ చదవండి...