ETV Bharat / city

రూ. 30 కోట్లు వృథా కాదా ?: చంద్రబాబు

author img

By

Published : Jan 27, 2020, 8:09 PM IST

Updated : Jan 28, 2020, 4:20 AM IST

మండలి రద్దుపై వైకాపా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.  ఇష్టానుసారంగా వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చి ఆమోద ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.  అలాంటి బిల్లులను అపేందుకు తెదేపా ఎమ్మెల్సీలు తీవ్రంగా కృషి చేశారని అన్నారు. నాలుగు రోజుల సమయం ఇచ్చి తమ పార్టీ ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. సంవత్సరానికి 60కోట్లతో మండలిని నిర్వహించలేమన్న జగన్...రాజధాని కేసుల విచారణ కోసం న్యాయవాదికి ఐదు కోట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

chandrababu fire on YS jagan over council cancelliation
chandrababu fire on YS jagan over council cancelliation


వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండలి రద్దుపై ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలలో 86 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. వైకాపా నేతలపై వేధింపులు, హత్యాయత్నం, అపహరణ కేసులున్నాయని అన్నారు. ఈ కేసుల గురించి సమాధానం చెప్పే ధైర్యం జగన్​కు ఉందా అని ప్రశ్నించారు. బిల్లుల విషయంలో రాజకీయాలు ఎవరు చేశారో చెప్పాలని నిలదీశారు.

' సంవత్సరంలో 60 రోజులు మండలి సమావేశాలు జరుగుతాయనుకుంటే.. రోజుకు రూ.కోటి చొప్పున రూ.60 కోట్లు వృథా అన్నట్లు జగన్ మాట్లాడారు. తనపై కేసుల విచారణకు ప్రతివారం కోర్టుకు హాజరవ్వాలంటే భద్రతకే రూ.60 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఆయన ఏడాదికి 50 వారాలు కోర్టుకు వెళ్తారనుకున్నా.. రూ.30 కోట్లు ఖర్చవుతుంది. ఒక నిందితుడు హైకోర్టుకు వెళ్లడానికి భద్రత కోసం రూ.30 కోట్లు ఖర్చు పెడుతూ.. మండలి సమావేశాలకు రూ.60 కోట్లు వృథా అనడం విడ్డూరం కాదా? జగన్ తన కేసులు వాదిస్తున్న న్యాయవాదికి, అమరావతి కేసుల పేరుతో రూ.5 కోట్ల ప్రభుత్వ ధనం ఇవ్వడం , తన సొంత ఇంటి భద్రత కోసం రూ.41 కోట్లు మంజూరు చేస్తూ.. జీవో ఇవ్వడం వృథా కాదా?' అని చంద్రబాబు మండిపడ్డారు.

మీ ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల గురించి చెప్పే ధైర్యం ఉందా..?

ఓటింగ్ సమయంలోనూ నాటకం
మండలి రద్దు తీర్మానంపై సభలో చేపట్టిన ఓటింగ్ సమయంలోనూ నాటకం ఆడారని చంద్రబాబు అన్నారు. మొదట సభలో 121 మంది ఉన్నారని చెప్పి.. చివరికి 133 మంది ఉన్నారని చెప్పారని తెలిపారు. ఇటీవల కాలంలో 10 రాష్ట్రాలు మండలిని పునరుద్ధరించాలని కోరిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

మండలిలో ఎన్ని బిల్లులకు అడ్డుపడ్డాం..?

వీడియోల ప్రదర్శన....
మీడియాతో మాట్లాడిన చంద్రబాబు...మండలి పునరుద్ధరణపై నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం మాట్లాడరనే దానిపై వీడియో టేపులను ప్రదర్శించారు.అదే సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మండలిపై మాట్లాడిన వ్యాఖ్యలను చూపించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని చెప్పే జగన్...ఇలా ఎలా చేశారని ప్రశ్నించారు. తన అనవసరాలకు అనుగుణంగా మాట మార్చే వ్యక్తి జగన్ అని చెప్పుకొచ్చారు.

ఐదు కోట్లు ఎలా చెల్లిస్తారు...
మండలికి 60 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పే జగన్...తన వ్యక్తిగత కేసుల విషయంలో హాజరయ్యేందుకు భద్రత కోసం కోట్ల రూపాయలు ఎలా ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు.

మండలిపై 60కోట్ల ఖర్చు సరే..మరీ మీ కోర్టు ఖర్చుల సంగతేంటీ..?

ఆంగ్లమాధ్యానికి మేం వ్యతిరేకం కాదు..
మాతృభాషను కాపాడుకోవాలని మాత్రమే తాము చెప్పామని చంద్రబాబు తెలిపారు. ఆంగ్ల మాధ్యమాన్ని మేం వ్యతిరేకించలేదన్నారు. విమర్శలు చేయడం పత్రికల బాధ్యత అని...అది వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వ్యాఖ్యానించారు. కానీ వైకాపా ప్రభుత్వం...కొన్ని మీడియా సంస్థల పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియాపై బెదిరింపులా: చంద్రబాబు

భయభ్రాంతులకు గురి చేసే యత్నం...
మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించారని అన్నారు. ఛైర్మన్​తో పాటు తెదేపా ఎమ్మెల్సీలపై ఇష్టానుసారంగా మాట్లాడరని పేర్కొన్నారు. గడిచిన నాలుగు రోజుల్లో తెదేపా ఎమ్మెల్సీలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారని...కానీ అలాంటి బెదిరింపులకు తమ ఎమ్మెల్సీలు లొంగలేదని అన్నారు. బిల్లులను సెలక్ట్​ కమిటీకి పంపించినందుకే... ఉదయం కేబినెట్​లో మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

మండలిలో మంత్రులు ఇష్టానుసారం వ్యవహరించారు

రాజధానిపై మాట మార్చిన పార్టీ వైకాపా అని చంద్రబాబు అన్నారు. అమరావతికి మద్దతు తెలిపిన జగన్...తర్వాత మూడు రాజధానులు అని చెబుతున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో తెదేపా ఒకే మాట మీద ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై పోరాడతామన్న జగన్...అధికారంలోకి వచ్చాక ఆ విషయం మరిచిపోయారని దుయ్యబట్టారు.

విశాఖ అభివృద్ధికి తెదేపా కట్టుబడి ఉంది...

విశాఖను ఆర్థిక రాజధాని, టెక్నాలజీ హబ్‌, ఫార్మా, పర్యటక కేంద్రం చేయాలనుకున్నామని చంద్రబాబు అన్నారు. విశాఖను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తెదేపా కృషి చేసిందని తెలిపారు. ఎనిమిది నెలల పాలనలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఏదైనా చేశారా అని ప్రశ్నించారు.

అమరావతిని చంపేశారు...

రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టించే రాజధాని అమరావతి అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి రాజధానిని చంపేసే స్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ ఆరోపణలపై ఆధారాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. కమిటీల పేరుతో అడుగడుగునా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ అభివృద్ధికి తెదేపా ఎప్పుడూ అనుకూలమని చంద్రబాబు తెలిపారు.

అసెంబ్లీ, సచివాలయం ఒకే దగ్గర ఉండాలని చాలామంది నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని....రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని హితవు పలికారు.

ఇదీ చదవండి : మండలి రద్దు..! తీర్మానానికి శాసనసభ ఆమోదం


వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండలి రద్దుపై ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలలో 86 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. వైకాపా నేతలపై వేధింపులు, హత్యాయత్నం, అపహరణ కేసులున్నాయని అన్నారు. ఈ కేసుల గురించి సమాధానం చెప్పే ధైర్యం జగన్​కు ఉందా అని ప్రశ్నించారు. బిల్లుల విషయంలో రాజకీయాలు ఎవరు చేశారో చెప్పాలని నిలదీశారు.

' సంవత్సరంలో 60 రోజులు మండలి సమావేశాలు జరుగుతాయనుకుంటే.. రోజుకు రూ.కోటి చొప్పున రూ.60 కోట్లు వృథా అన్నట్లు జగన్ మాట్లాడారు. తనపై కేసుల విచారణకు ప్రతివారం కోర్టుకు హాజరవ్వాలంటే భద్రతకే రూ.60 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఆయన ఏడాదికి 50 వారాలు కోర్టుకు వెళ్తారనుకున్నా.. రూ.30 కోట్లు ఖర్చవుతుంది. ఒక నిందితుడు హైకోర్టుకు వెళ్లడానికి భద్రత కోసం రూ.30 కోట్లు ఖర్చు పెడుతూ.. మండలి సమావేశాలకు రూ.60 కోట్లు వృథా అనడం విడ్డూరం కాదా? జగన్ తన కేసులు వాదిస్తున్న న్యాయవాదికి, అమరావతి కేసుల పేరుతో రూ.5 కోట్ల ప్రభుత్వ ధనం ఇవ్వడం , తన సొంత ఇంటి భద్రత కోసం రూ.41 కోట్లు మంజూరు చేస్తూ.. జీవో ఇవ్వడం వృథా కాదా?' అని చంద్రబాబు మండిపడ్డారు.

మీ ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల గురించి చెప్పే ధైర్యం ఉందా..?

ఓటింగ్ సమయంలోనూ నాటకం
మండలి రద్దు తీర్మానంపై సభలో చేపట్టిన ఓటింగ్ సమయంలోనూ నాటకం ఆడారని చంద్రబాబు అన్నారు. మొదట సభలో 121 మంది ఉన్నారని చెప్పి.. చివరికి 133 మంది ఉన్నారని చెప్పారని తెలిపారు. ఇటీవల కాలంలో 10 రాష్ట్రాలు మండలిని పునరుద్ధరించాలని కోరిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

మండలిలో ఎన్ని బిల్లులకు అడ్డుపడ్డాం..?

వీడియోల ప్రదర్శన....
మీడియాతో మాట్లాడిన చంద్రబాబు...మండలి పునరుద్ధరణపై నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం మాట్లాడరనే దానిపై వీడియో టేపులను ప్రదర్శించారు.అదే సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మండలిపై మాట్లాడిన వ్యాఖ్యలను చూపించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని చెప్పే జగన్...ఇలా ఎలా చేశారని ప్రశ్నించారు. తన అనవసరాలకు అనుగుణంగా మాట మార్చే వ్యక్తి జగన్ అని చెప్పుకొచ్చారు.

ఐదు కోట్లు ఎలా చెల్లిస్తారు...
మండలికి 60 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పే జగన్...తన వ్యక్తిగత కేసుల విషయంలో హాజరయ్యేందుకు భద్రత కోసం కోట్ల రూపాయలు ఎలా ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు.

మండలిపై 60కోట్ల ఖర్చు సరే..మరీ మీ కోర్టు ఖర్చుల సంగతేంటీ..?

ఆంగ్లమాధ్యానికి మేం వ్యతిరేకం కాదు..
మాతృభాషను కాపాడుకోవాలని మాత్రమే తాము చెప్పామని చంద్రబాబు తెలిపారు. ఆంగ్ల మాధ్యమాన్ని మేం వ్యతిరేకించలేదన్నారు. విమర్శలు చేయడం పత్రికల బాధ్యత అని...అది వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వ్యాఖ్యానించారు. కానీ వైకాపా ప్రభుత్వం...కొన్ని మీడియా సంస్థల పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియాపై బెదిరింపులా: చంద్రబాబు

భయభ్రాంతులకు గురి చేసే యత్నం...
మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించారని అన్నారు. ఛైర్మన్​తో పాటు తెదేపా ఎమ్మెల్సీలపై ఇష్టానుసారంగా మాట్లాడరని పేర్కొన్నారు. గడిచిన నాలుగు రోజుల్లో తెదేపా ఎమ్మెల్సీలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారని...కానీ అలాంటి బెదిరింపులకు తమ ఎమ్మెల్సీలు లొంగలేదని అన్నారు. బిల్లులను సెలక్ట్​ కమిటీకి పంపించినందుకే... ఉదయం కేబినెట్​లో మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

మండలిలో మంత్రులు ఇష్టానుసారం వ్యవహరించారు

రాజధానిపై మాట మార్చిన పార్టీ వైకాపా అని చంద్రబాబు అన్నారు. అమరావతికి మద్దతు తెలిపిన జగన్...తర్వాత మూడు రాజధానులు అని చెబుతున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో తెదేపా ఒకే మాట మీద ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై పోరాడతామన్న జగన్...అధికారంలోకి వచ్చాక ఆ విషయం మరిచిపోయారని దుయ్యబట్టారు.

విశాఖ అభివృద్ధికి తెదేపా కట్టుబడి ఉంది...

విశాఖను ఆర్థిక రాజధాని, టెక్నాలజీ హబ్‌, ఫార్మా, పర్యటక కేంద్రం చేయాలనుకున్నామని చంద్రబాబు అన్నారు. విశాఖను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తెదేపా కృషి చేసిందని తెలిపారు. ఎనిమిది నెలల పాలనలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఏదైనా చేశారా అని ప్రశ్నించారు.

అమరావతిని చంపేశారు...

రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టించే రాజధాని అమరావతి అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి రాజధానిని చంపేసే స్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ ఆరోపణలపై ఆధారాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. కమిటీల పేరుతో అడుగడుగునా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ అభివృద్ధికి తెదేపా ఎప్పుడూ అనుకూలమని చంద్రబాబు తెలిపారు.

అసెంబ్లీ, సచివాలయం ఒకే దగ్గర ఉండాలని చాలామంది నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని....రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని హితవు పలికారు.

ఇదీ చదవండి : మండలి రద్దు..! తీర్మానానికి శాసనసభ ఆమోదం

Last Updated : Jan 28, 2020, 4:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.