అమరావతిలోనే రాజధాని ఉంటుందని, భూమిలిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేలా ప్రభుత్వంపై ఉద్యమం తీసుకొస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పునరుద్ఘాటించారు. భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమారస్వామి ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత రైతులతో సోము వీర్రాజు సమావేశమయ్యారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
అమరావతిలోనే రాజధాని ఉండాలని.. భూమిలిచ్చిన 29 వేల మంది రైతులకు 64 వేల ప్లాట్లు ఇవ్వాలని, మిగిలిన తొమ్మిది వేల ఎకరాల భూమిని అభివృద్ధి చేయాల్సిందిగా ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం ఇవ్వకుంటే తామే ప్లాట్లు ఇప్పిస్తామని, రాజధాని భూములను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.