ETV Bharat / city

భాగ్యనగరంలో కనిపించని భారత్​ బంద్..

author img

By

Published : Mar 26, 2021, 12:44 PM IST

భాగ్యనగరంపై భారత్​ బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు సంఘాల సమాఖ్య బంద్​కు పిలుపునిచ్చినా.. నగరంలో రవాణా వ్యవస్థకు ఎక్కడా ఆటంకం ఏర్పడలేదు.

bharat bandh
భాగ్యనగరంలో కనిపించని భారత్​ బంద్..

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు సంఘాల సమాఖ్య భారత్​ బంద్​కు పిలుపునిచ్చింది. కానీ.. నగరంలో రవాణా వ్యవస్థకు ఎక్కడా ఆటంకం ఏర్పడలేదు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు నడిచాయి. మెట్రో రైళ్లూ యథావిధిగా కొనసాగుతున్నాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి.

ఉద్యోగాలకు వెళ్లే వారంతా రోజులాగే ఇళ్ల నుంచి బయలుదేరి కార్యాలయాలకు చేరుకున్నారు. అఖిల భారత వర్తక సమాఖ్య కూడా బంద్​లో పాల్గొనబోమని ఇదివరకే ప్రకటించింది.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు సంఘాల సమాఖ్య భారత్​ బంద్​కు పిలుపునిచ్చింది. కానీ.. నగరంలో రవాణా వ్యవస్థకు ఎక్కడా ఆటంకం ఏర్పడలేదు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు నడిచాయి. మెట్రో రైళ్లూ యథావిధిగా కొనసాగుతున్నాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి.

ఉద్యోగాలకు వెళ్లే వారంతా రోజులాగే ఇళ్ల నుంచి బయలుదేరి కార్యాలయాలకు చేరుకున్నారు. అఖిల భారత వర్తక సమాఖ్య కూడా బంద్​లో పాల్గొనబోమని ఇదివరకే ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.