ETV Bharat / city

నాటక రూపంలో అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

author img

By

Published : Mar 31, 2021, 8:20 AM IST

తెలంగాణలోని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో మళ్లీ కొవిడ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించకపోతే వచ్చే పరిణామాలను పోలీసు కళాబృందంతో నాటక రూపంలో ప్రదర్శించారు.

corona, awareness
నాటక రూపంలో అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్‌స్పెక్టర్ నాగమల్లు ఆధ్వర్యంలో కొత్తపేట కూడలి వద్ద పోలీసు కళాబృందంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

నాటక రూపంలో అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ 68 ప్రకారంగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. శానిటైజర్లు ఉపయోగించి ఆరోగ్య నియమాలు పాటించి కరోనా ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవాలన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకుండా ఉంటే వచ్చే పరిణామాలను వాహనదారులకు అర్థమయ్యే రీతిలో నాటక రూపంలో ప్రదర్శించారు.

ఇదీ చూడండి:

తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్​సీసీ ఆస్తుల పంపకం!

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్‌స్పెక్టర్ నాగమల్లు ఆధ్వర్యంలో కొత్తపేట కూడలి వద్ద పోలీసు కళాబృందంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

నాటక రూపంలో అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ 68 ప్రకారంగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. శానిటైజర్లు ఉపయోగించి ఆరోగ్య నియమాలు పాటించి కరోనా ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవాలన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకుండా ఉంటే వచ్చే పరిణామాలను వాహనదారులకు అర్థమయ్యే రీతిలో నాటక రూపంలో ప్రదర్శించారు.

ఇదీ చూడండి:

తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్​సీసీ ఆస్తుల పంపకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.