ఎస్సై రామారావుకు సీఐ పదోన్నతి కల్పించే ప్యానల్లో స్థానం కల్పించాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలను అమలు చేయట్లేదంటూ.. రామారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. నోటీసులు జారీ చేసింది. తాజాగా మరోసారి పిటిషన్ విచారణకు రాగా.. ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు తరఫున న్యాయవాది విచారణకు హాజరయ్యారు. నోటీసులు అందుకున్నా హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఐజీలు.. న్యాయవాదులను నియమించుకోలేదు..స్వయంగా కూడా హాజరుకాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆ అధికారుల వ్యక్తిగత హజరుకు నోటీసులు జారీ చేసింది. విచారణను జనవరి 25కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్