రాష్ట్రాభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు తీసుకోవడంపై విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం చట్టవిరుద్ధంగా 25 వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకుందని పిటిషనర్ తరపు న్యాయవాదులు బసవ ప్రభు పాటిల్, యలమంజుల బాలాజీలు వాదించారు. ప్రజాధనాన్ని కన్సాలిడేట్ ఫండ్కు కాకుండా నేరుగా స్టేట్ కార్పొరేషన్లోకి మళ్లిస్తున్నారని అన్నారు.
రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాజ్యం వేశారని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కన్సాలిడేట్ ఫండ్ నుంచే నిధులు వెళుతున్నాయని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది.. ఈ కేసులో మరిన్ని వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని పిటిషనర్ న్యాయవాది కోరారు . దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. కేసు విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు- పంజ్షేర్ నేతకు చోటు!