వ్యవసాయ పంపుసెట్లు ఏటా 3 శాతం పెరుగుతుండటంతో రాయితీ మొత్తం 2030-31 నాటికి రూ.17,819 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పగలు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం సౌర విద్యుత్తోనే సాధ్యమని భావిస్తోంది. ఇందులో భాగంగానే 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్లాంటు నిర్మాణ బాధ్యతను ఏపీ గ్రీన్ఎనర్జీ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. పారదర్శక విధానంలో బిడ్డింగ్ నిర్వహించాలని సూచించింది. ఈ ప్రాజెక్టుకు గ్రామపంచాయతీల ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేకుండా మినహాయింపునిచ్చింది.
ఇదీ చదవండి: నవరత్నాలకే ప్రాధాన్యం.. బడ్జెట్ అంచనా రూ.2.30 లక్షల కోట్లు..!