రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గాల స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 13, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు ఆదేశాల్చించింది. విశాఖ, ఏలూరు, గుంటూరు, తిరుపతి నగరాల్లో 4 ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్స్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యత పరిశీలించనున్నారు.
164 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు
విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యత పరిశీలన కోసం....రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గం, జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో మొత్తం 164 అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలిచ్చింది.
![164 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా 164 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు ఉత్తర్వులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8160016-732-8160016-1595603976463.jpg?imwidth=3840)
రూ.197 కోట్లతో ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నాబార్డుకు సమర్పించింది. నాబార్డు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్ఐడీఎఫ్) కింద రూ.150 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.
ఇదీ చదవండి : కరోనా బాధితుల్ని చేర్చుకోని ఆసుపత్రులపై కఠిన చర్యలు: హోంమంత్రి సుచరిత
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గాల స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 13, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు ఆదేశాల్చించింది. విశాఖ, ఏలూరు, గుంటూరు, తిరుపతి నగరాల్లో 4 ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్స్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యత పరిశీలించనున్నారు.
రూ.197 కోట్లతో ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నాబార్డుకు సమర్పించింది. నాబార్డు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్ఐడీఎఫ్) కింద రూ.150 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.
ఇదీ చదవండి : కరోనా బాధితుల్ని చేర్చుకోని ఆసుపత్రులపై కఠిన చర్యలు: హోంమంత్రి సుచరిత