ETV Bharat / city

చంద్రబాబు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి: అంబటి - ambati rambabu on nara bhuvaneshwari news

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని వైకాపా స్పష్టం చేసింది. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పునరుద్ఘాటించింది. అమరావతిపై వైకాపా ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ambati rambabu on nara bhuvaneshwari
ambati rambabu on nara bhuvaneshwari
author img

By

Published : Jan 2, 2020, 5:38 PM IST

Updated : Jan 2, 2020, 7:36 PM IST

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినందునే చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని... వైకాపా ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో 21 నిమిషాల నిడివి గల వీడియోను ప్రదర్శించిన వారు... తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు భూములు కొనుగోలు చేశారంటూ పేర్లతో సహా వివరాలు వెల్లడించారు. ఇదే సమయంలో అమరావతి కోసం భూములిచ్చిన రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని ధైర్యం చెప్పారు. రైతులెవరూ చంద్రబాబు మాయలో పడొద్దని కోరారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అంబటి రాంబాబు హెచ్చరించారు.

చంద్రబాబు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి:అంబటి

భువనేశ్వరికి రైతులపై ఎందుకంత ప్రేమో

రాజధాని రైతుల నిరసనకు మద్దతుగా తెదేపా చేస్తున్న కార్యక్రమాలపై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పుష్కరాల్లో 30 మంది చనిపోయినా... గత ప్రభుత్వ హయంలో రైతులు చనిపోయినా... నారా భువనేశ్వరికి జాలి కలగలేదని ఎమ్మెల్యే అంబటి ధ్వజమెత్తారు. ఎప్పుడూ లేనిది అమరావతి రైతులపై భువనేశ్వరికి ఎందుకు ప్రేమ కలిగిందోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

చంద్రబాబు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి:అంబటి

ఇదీ చదవండి: అమరావతి కోసం.. భువనేశ్వరి గాజులు విరాళం

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినందునే చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని... వైకాపా ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో 21 నిమిషాల నిడివి గల వీడియోను ప్రదర్శించిన వారు... తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు భూములు కొనుగోలు చేశారంటూ పేర్లతో సహా వివరాలు వెల్లడించారు. ఇదే సమయంలో అమరావతి కోసం భూములిచ్చిన రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని ధైర్యం చెప్పారు. రైతులెవరూ చంద్రబాబు మాయలో పడొద్దని కోరారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అంబటి రాంబాబు హెచ్చరించారు.

చంద్రబాబు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి:అంబటి

భువనేశ్వరికి రైతులపై ఎందుకంత ప్రేమో

రాజధాని రైతుల నిరసనకు మద్దతుగా తెదేపా చేస్తున్న కార్యక్రమాలపై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పుష్కరాల్లో 30 మంది చనిపోయినా... గత ప్రభుత్వ హయంలో రైతులు చనిపోయినా... నారా భువనేశ్వరికి జాలి కలగలేదని ఎమ్మెల్యే అంబటి ధ్వజమెత్తారు. ఎప్పుడూ లేనిది అమరావతి రైతులపై భువనేశ్వరికి ఎందుకు ప్రేమ కలిగిందోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

చంద్రబాబు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలి:అంబటి

ఇదీ చదవండి: అమరావతి కోసం.. భువనేశ్వరి గాజులు విరాళం

Intro:Body:Conclusion:
Last Updated : Jan 2, 2020, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.