ETV Bharat / city

కళ్లకు గంతలు కట్టుకుని... న్యాయదేవతకు వినతి - రాజధాని అమరావతి వార్తలు

రాజధాని ప్రాంత రైతులు 326వ రోజూ ఆందోళన కొనసాగించారు. వెంకటపాలెంలో మహిళలు వినూత్న నిరసన తెలియజేశారు. కళ్లకు గంతలు కట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ న్యాయదేవతను కొంగు చాపి అర్ధించారు.

AMARAVATI FARMERS
AMARAVATI FARMERS
author img

By

Published : Nov 7, 2020, 6:44 PM IST

కళ్లకు గంతలు కట్టుకుని... న్యాయదేవతకు వినతి

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు 326వ రోజూ ఆందోళన తెలిపారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. శిబిరాల వద్ద మహిళలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

వెంకటపాలెంలో మహిళలు వినూత్న నిరసన తెలియజేశారు. ధర్నాలు ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలను న్యాయదేవత ముందు ఉంచి.... తమకు న్యాయం చేయాలంటూ కొంగు చాపి అర్ధించారు. రాజధాని గ్రామాల్లో శిబిరాల వద్ద మహిళలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి

'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'

కళ్లకు గంతలు కట్టుకుని... న్యాయదేవతకు వినతి

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు 326వ రోజూ ఆందోళన తెలిపారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, వెంకటపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. శిబిరాల వద్ద మహిళలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

వెంకటపాలెంలో మహిళలు వినూత్న నిరసన తెలియజేశారు. ధర్నాలు ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలను న్యాయదేవత ముందు ఉంచి.... తమకు న్యాయం చేయాలంటూ కొంగు చాపి అర్ధించారు. రాజధాని గ్రామాల్లో శిబిరాల వద్ద మహిళలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి

'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.