ETV Bharat / city

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి అమరావతి సెగ

author img

By

Published : Oct 8, 2020, 7:19 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీకి అమరావతి రైతుల ఆందోళన సెగ తగిలింది. తుళ్లూరులో జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను...గో బ్యాక్​, గో బ్యాక్ అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. తమను కించ పరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీదేవీ క్షమాపణలు చెప్పాకే అమరావతిలో అడుగుపెట్టాలని డిమాండ్​ చేశారు.

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవీకి అమరావతి నిరసన సెగ
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవీకి అమరావతి నిరసన సెగ

గుంటూరు జిల్లా తుళ్లూరులో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవికి అమరావతి రైతుల ఆందోళనల సెగ తగిలింది. శాసన సభ్యురాలు ఈ కార్యక్రమానికి వెళ్లేముందు, ముగించుకుని వెళ్తునప్పుడూ రైతులు, మహిళలు గోబ్యాక్..... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

తమను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించిన శాసనసభ్యురాలు క్షమాపణలు చెప్పిన తర్వాతే అమరావతిలో పర్యటించాలని రైతులు నినాదాలు చేశారు. శ్రీదేవి కాన్వాయ్​ను అడ్డుకునేందుకు యత్నించిన రైతులు, మహిళలను పోలీసులు రోడ్డు పైకి రాకుండా నిలువరించారు. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే తమనే కించపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

గుంటూరు జిల్లా తుళ్లూరులో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవికి అమరావతి రైతుల ఆందోళనల సెగ తగిలింది. శాసన సభ్యురాలు ఈ కార్యక్రమానికి వెళ్లేముందు, ముగించుకుని వెళ్తునప్పుడూ రైతులు, మహిళలు గోబ్యాక్..... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

తమను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించిన శాసనసభ్యురాలు క్షమాపణలు చెప్పిన తర్వాతే అమరావతిలో పర్యటించాలని రైతులు నినాదాలు చేశారు. శ్రీదేవి కాన్వాయ్​ను అడ్డుకునేందుకు యత్నించిన రైతులు, మహిళలను పోలీసులు రోడ్డు పైకి రాకుండా నిలువరించారు. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే తమనే కించపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారులకు చిక్కిన భారీ చేపలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.