స్థానిక సంస్థల ఎన్నికలకు తదుపరి నోటిఫికేషన్ విడుదల చేసే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టు ఆదేశించిందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రస్తుత అభివృద్ధి పథకాలన్నింటిని కొనసాగించొచ్చని.. ఈ మేరకు సుప్రీం ఆదేశాలిచ్చిందని శ్రీరామ్ తెలిపారు. ఎన్నికల కమిషన్ వేసిన కేవియెట్ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వాదించినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : ఎన్నికల కోడ్ రద్దు.. వాయిదా కొనసాగింపు.. కొత్త పథకాలు వద్దు..