ముఖ్యమంత్రి జగన్...కరోనా కష్టకాలంలోనూ కాసులు దండుకుంటున్నారని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో ర్యాపిడ్ కిట్లు ఒక్కోటి 337రూపాయలు ఉంటే, ఏపీలో 817 రూపాయలు ఉందని మండిపడ్డారు. ప్రపంచం కరోనాతో అల్లాడుతున్న సమయంలో కరోనా టెస్టింగ్ కిట్లలో కూడా వాటాలు దండుకోవడం సిగ్గు చేటన్నారు. కరోనా కిట్ల కొనుగోళ్లలో ఏకంగా రూ.8 కోట్లు కొట్టేశారని ఆరోపించారు. హాట్ స్పాట్లున్న ప్రాంతాల్లో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో ఉందన్న ఆయన.. కరోనా పరీక్షల విషయంలో, పరీక్షా కిట్ల విషయంలో దోచుకోవడం ఏంటని మండిపడ్డారు.
ఇవీ చదవండి: 'కరోనా ఫ్రీ'గా మణిపుర్.. ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్పంగానే