ETV Bharat / city

KTR & RAJASINGH TWEETS: కేటీఆర్‌, రాజాసింగ్‌ మధ్య ట్వీట్ వార్

author img

By

Published : Oct 23, 2021, 12:58 PM IST

Updated : Oct 23, 2021, 4:15 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆ రాష్ట్ర భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ నడుమ ట్వీట్స్ వార్(ktr and raja singh tweets) జరుగుతోంది. హైదరాబాద్ ఓల్డ్​సిటీలోని పరిస్థితిని బైక్​పై పర్యటించి తెలుసుకోవాలని కేటీఆర్​కు రాజాసింగ్ సవాలు విసరగా... ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఆగి.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని మంత్రి కౌంటర్ ఇచ్చారు. దీనికి స్పందించిన రాజాసింగ్...కేటీఆర్ సమాధానం చెప్పకుండా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ట్వీట్ చేశారు.

ktr and raja singh tweets
ktr and raja singh tweets

కేటీఆర్‌, రాజాసింగ్‌ మధ్య ట్వీట్ వార్

ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ల నడుమ ట్వీట్స్ వార్(ktr and raja singh tweets) సాగుతోంది. ధనిక రాష్ట్రంగా చెబుతున్న తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఓల్డ్ సిటీలో చేసిన అభివృద్ధి మంత్రి కేటీఆర్ బైక్​పై పర్యటించి తెలుసుకోవాలని రాజాసింగ్(mla raja singh challenge to minister ktr) సవాలు విసిరారు. చిన్నపాటి వర్షానికి ఓల్డ్ సిటీ ప్రాంతంలో రహదారులు, దుకాణాలు, ఇళ్లలోకి భారీగా నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు.

ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఆగి.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని(ktr challenge to mla raja singh) మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఎల్​పీజీ ధరలపైనా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు. భాజపా పాలనలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడమా? అంటూ ప్రశ్నించారు. మాటల గారడీ ఆపి మంచి పనులతో ప్రజల హృదయాలు గెలుచుకోవాలని రీట్వీట్ చేశారు.

కొద్దిపాటి వర్షానికే పాతబస్తీ మునిగిపోతుందని.. వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు తనతో కలిసి బైక్‌ మీద తిరగాలని కేటీఆర్‌ను ట్విట్టర్‌ వేదికగా ఆహ్వానిస్తే ఆరు రోజులు ఆలస్యంగా స్పందించారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎద్దేవా చేశారు. ట్వీట్‌ చేసిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం చెప్పకుండా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారంటూ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్‌ చేశారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల మీద ప్రేమే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న 41రూపాయలను మినహాయించాలని డిమాండ్‌ చేశారు. పాతబస్తీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని కేసీఆర్‌, కేటీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. నిజాంకాలంలో నిర్మించిన నాలాలే ఇప్పటికీ ఉన్నాయని వాటిని ఏ మాత్రం పునర్నిర్మించలేదన్నారు.

'దాదాపు ఆరు రోజుల క్రితం ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​కు ఓ ట్వీట్​ పెట్టాను. విషయమేంటంటే కొద్ది వర్షం పడితే పాతబస్తీ మునిగిపోతుంది. నిజాంకాలంలో నిర్మించిన నాలాలే ఇప్పటికీ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్​, కేటీఆర్​ అబద్ధాలు మాట్లాడుతున్నారు. పాతబస్తీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అయితే కేటీఆర్​కు ట్విట్టర్​ వేదికగా ఒక రిక్వెస్ట్​ ఏం చేశానంటే.. కేటీఆర్​ గారు మీరు, నేను కలిసి పాతబస్తీలో బైక్​పై తిరిగితే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని చెప్పాను. ఆయన దానికి సమాధానం ఇవ్వకుండా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారంటూ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్‌ చేశారు. కేంద్రం పెంచుతోందని మీరు అంటున్నరు. అందులో రాష్ట్రం వాటా ఏమి లేదా?. మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న 41రూపాయలను మినహాయించండి.' -రాజాసింగ్​, గోషామహల్​ ఎమ్మెల్యే

ఇదీ చదవండి:

28న రాష్ట్ర కేబినెట్ భేటీ.. ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు

కేటీఆర్‌, రాజాసింగ్‌ మధ్య ట్వీట్ వార్

ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ల నడుమ ట్వీట్స్ వార్(ktr and raja singh tweets) సాగుతోంది. ధనిక రాష్ట్రంగా చెబుతున్న తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఓల్డ్ సిటీలో చేసిన అభివృద్ధి మంత్రి కేటీఆర్ బైక్​పై పర్యటించి తెలుసుకోవాలని రాజాసింగ్(mla raja singh challenge to minister ktr) సవాలు విసిరారు. చిన్నపాటి వర్షానికి ఓల్డ్ సిటీ ప్రాంతంలో రహదారులు, దుకాణాలు, ఇళ్లలోకి భారీగా నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు.

ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఆగి.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని(ktr challenge to mla raja singh) మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఎల్​పీజీ ధరలపైనా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు. భాజపా పాలనలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడమా? అంటూ ప్రశ్నించారు. మాటల గారడీ ఆపి మంచి పనులతో ప్రజల హృదయాలు గెలుచుకోవాలని రీట్వీట్ చేశారు.

కొద్దిపాటి వర్షానికే పాతబస్తీ మునిగిపోతుందని.. వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు తనతో కలిసి బైక్‌ మీద తిరగాలని కేటీఆర్‌ను ట్విట్టర్‌ వేదికగా ఆహ్వానిస్తే ఆరు రోజులు ఆలస్యంగా స్పందించారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎద్దేవా చేశారు. ట్వీట్‌ చేసిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం చెప్పకుండా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారంటూ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్‌ చేశారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల మీద ప్రేమే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న 41రూపాయలను మినహాయించాలని డిమాండ్‌ చేశారు. పాతబస్తీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని కేసీఆర్‌, కేటీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. నిజాంకాలంలో నిర్మించిన నాలాలే ఇప్పటికీ ఉన్నాయని వాటిని ఏ మాత్రం పునర్నిర్మించలేదన్నారు.

'దాదాపు ఆరు రోజుల క్రితం ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​కు ఓ ట్వీట్​ పెట్టాను. విషయమేంటంటే కొద్ది వర్షం పడితే పాతబస్తీ మునిగిపోతుంది. నిజాంకాలంలో నిర్మించిన నాలాలే ఇప్పటికీ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్​, కేటీఆర్​ అబద్ధాలు మాట్లాడుతున్నారు. పాతబస్తీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అయితే కేటీఆర్​కు ట్విట్టర్​ వేదికగా ఒక రిక్వెస్ట్​ ఏం చేశానంటే.. కేటీఆర్​ గారు మీరు, నేను కలిసి పాతబస్తీలో బైక్​పై తిరిగితే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని చెప్పాను. ఆయన దానికి సమాధానం ఇవ్వకుండా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారంటూ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్‌ చేశారు. కేంద్రం పెంచుతోందని మీరు అంటున్నరు. అందులో రాష్ట్రం వాటా ఏమి లేదా?. మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న 41రూపాయలను మినహాయించండి.' -రాజాసింగ్​, గోషామహల్​ ఎమ్మెల్యే

ఇదీ చదవండి:

28న రాష్ట్ర కేబినెట్ భేటీ.. ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు

Last Updated : Oct 23, 2021, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.