ETV Bharat / city

తెలంగాణ: మరో 975 మందికి కరోనా.. 15, 394కు పెరిగిన బాధితులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రతాపం ఎంతకూ తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో 975 కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలోనే 861 మందికి కరోనా సోకింది.

author img

By

Published : Jun 29, 2020, 10:35 PM IST

975 new covid 19 cases in telangan975 new covid 19 cases in telangana todaya today
975 new covid 19 cases in telangana today

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 975 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మొత్తం 2648 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 975 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 1673 కేసులు నెగెటివ్‌గా తేలాయి. తాజా కేసులతో కలిపి వైరస్​ సోకిన వారి సంఖ్య 15394కి చేరింది.

తెలంగాణ: మరో 975 మందికి కరోనా
తెలంగాణ: మరో 975 మందికి కరోనా

కొత్తగా మరో ఆరు మరణాలు

రాష్ట్రంలో కొత్తగా ఆరుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 253కి పెరిగింది. అలాగే, ఈ ఒక్క రోజే 410 మంది కోలుకోగా.. ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5582కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీలోనే 861

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కేసులు రోజురోజుకీ ఉద్ధృతమవుతుండటం కలవరపెడుతోంది. ఈ రోజు 861 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ రోజు అత్యధికంగా రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్‌లో 10 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 975 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మొత్తం 2648 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 975 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 1673 కేసులు నెగెటివ్‌గా తేలాయి. తాజా కేసులతో కలిపి వైరస్​ సోకిన వారి సంఖ్య 15394కి చేరింది.

తెలంగాణ: మరో 975 మందికి కరోనా
తెలంగాణ: మరో 975 మందికి కరోనా

కొత్తగా మరో ఆరు మరణాలు

రాష్ట్రంలో కొత్తగా ఆరుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 253కి పెరిగింది. అలాగే, ఈ ఒక్క రోజే 410 మంది కోలుకోగా.. ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5582కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీలోనే 861

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కేసులు రోజురోజుకీ ఉద్ధృతమవుతుండటం కలవరపెడుతోంది. ఈ రోజు 861 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ రోజు అత్యధికంగా రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్‌లో 10 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.