ETV Bharat / briefs

మంత్రి అభిమానుల అత్యుత్సాహం...కాలి బుడిదైన లక్షల పొగాకు - minister

అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి విజయోత్సవ ర్యాలీని ఏడుగుండ్లపాడులో నిర్వహించారు. అభిమానులు కాల్చిన టపాసులు పడి పొగాకు గోడౌన్ కాలిపోయింది.

అగ్ని ప్రమాదంలో పొగాకు గూడెం దగ్ధం
author img

By

Published : Jun 13, 2019, 6:27 AM IST

Updated : Jun 13, 2019, 6:55 AM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలోని మురళి పొగాకు గ్రేడింగ్ సెంటర్‌లో టపాసులు పడి పూర్తిగా కాలిపోయింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒంగోలు తిరిగి వస్తున్న తరుణంలో ఏడుగుండ్లపాడు వద్ద అభిమానులు కాల్చిన టపాసుల నిప్పు రవ్వలు పొగాకు గోడౌన్​పై పడ్డాయని... కొద్దిసేపట్లోనే మంటలు వ్యాపించాయని బాధితులు వాపోయారు. మంటలు ఆర్పేందుకు అక్కడి ప్రజలు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రానందున అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పది లక్షల విలువ చేసే పొగాకు పూర్తిగా కాలిపోయింది.

అగ్ని ప్రమాదంలో పొగాకు గూడెం దగ్ధం

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలోని మురళి పొగాకు గ్రేడింగ్ సెంటర్‌లో టపాసులు పడి పూర్తిగా కాలిపోయింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒంగోలు తిరిగి వస్తున్న తరుణంలో ఏడుగుండ్లపాడు వద్ద అభిమానులు కాల్చిన టపాసుల నిప్పు రవ్వలు పొగాకు గోడౌన్​పై పడ్డాయని... కొద్దిసేపట్లోనే మంటలు వ్యాపించాయని బాధితులు వాపోయారు. మంటలు ఆర్పేందుకు అక్కడి ప్రజలు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రానందున అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పది లక్షల విలువ చేసే పొగాకు పూర్తిగా కాలిపోయింది.

అగ్ని ప్రమాదంలో పొగాకు గూడెం దగ్ధం

ఇదీ చదవండీ :

అభిమానులకు కిక్​ ఇచ్చే కవిత చెప్పిన ధావన్​

Intro:పల్నాడులో శాంతిని నెలకొల్పుతాం: గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి.

పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టి శాంతిని నెలకొల్పుతామని గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ ఆర్.జయలక్ష్మి అన్నారు. జిలా రూరల్ ఎస్పీ గా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా నరసరావుపేట కు వచ్చిన సందర్భంగా డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో పార్టీల గొడవలు చోటు చేసుకున్నాయని, వాటికి సంబంధించి కేసులు నమోదు చేసి బాధ్యులను అరెస్ట్ చేశామన్నారు.


Body:పల్నాడులో సమస్యాత్మక గ్రామాల్లో వర్గ పోరుతో గొడవలు సృష్టించే వ్యక్తులకు తొలుత కౌన్సిలింగ్ ఇస్తామని , అప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేస్తామన్నారు. ఫ్యాక్షన్ గొడవలు జరిగితే అభివృద్ధి ఆగిపోవడమే కాక వారి పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్నారు. పార్టీల గోడవలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, భవిష్యత్తులో అలా జరగకుండా సిబ్బందిని పెంచుతామన్నారు. క్రికెట్ బెట్టింగ్, నిషేధిత గుట్కాలపై దృష్టి సారించి వాటిని అరికడతామన్నారు.


Conclusion:అదే విధంగా మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులపై వచ్చిన ఫిర్యాదుల గురించి మాట్లాడుతూ కేసులు నమోదు చేసి విచారిస్థామన్నారు. సంబంధిత కేసులకు సంబంధించి సాక్షాలుంటే సేకరించి న్యాయస్థానం లో ఉంచుతామన్నారు. ప్రజలతో స్నేహపూర్వకమైన పోలీసింగ్ అన్ని స్టేషన్లలో ఉండేలా చూస్తామన్నారు. స్టేషన్లకు వచ్చే ప్రజలతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచిస్తామన్నారు.

బైట్: ఆర్.జయలక్ష్మి, గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ.


ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట
9885066052.
Last Updated : Jun 13, 2019, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.