శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడా జంక్షన్ రైల్వే స్టేషన్లో విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కుతూ... భరత్ అనే ప్రయాణికుడు జారిపడిపోయాడు. కదులుతున్న రైలు ఎక్కబోతుండగా జారిపడిన భరత్ ప్లాట్ఫామ్ కిందపడిపోయాడు. ఆ సమయంలో రైలు కదలికలో ఉండడం వలన భరత్ కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి.క్షతగాత్రుడ్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. టెక్కలిలోని అత్తారింటికి వచ్చిన భరత్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇవీ చూడండి
పోటీ నుంచి తప్పుకో'.. వైకాపా శ్రేణుల బెదిరింపు!