గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. ఈనామ్(ఆన్లైన్ టెండర్) పద్ధతి అమలు చేయోద్దంటూ.. నిమ్మకాయల రైతులు ఆందోళన చేశారు. రైతుకు మద్దతు ధర, అమ్మకంలో పారదర్శకత కల్పించాలనే ఉద్దేశంతో.. కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈనామ్పై కర్షకుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నిమ్మకాయల రైతులు.. తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టం జరగకుండా గిట్టుబాటు ధర అందించాలని కోరుతున్నారు.
'ఈనెల 4 నుంచి కచ్చితంగా అమలు చేస్తాం'
ఓ పక్క అన్నదాతలు ఆందోళనలు చేస్తుంటే... అధికారులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఆన్లైన్ టెండర్ విధానం ద్వారా తెనాలి వ్యవసాయ మార్కెట్లో ఈనెల 4నుంచి... నిమ్మకాయల క్రయవిక్రయాలను కచ్చితంగా జరుపుతామని తెలుపుతున్నారు.
ఇవీ చదవండి...'భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి'