ఆంద్రప్రదేశ్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో అధికారుల, ఉద్యోగుల వార్షిక నియామక ప్రక్రియను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( ఐబీపీఎస్ ) ప్రారంభించింది. ఈ పరీక్షలు ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో జులై 21 నుంచి జులై 26 వరకు ఆఫీసర్స్ స్కేల్ 1 అభ్యర్థులకు, అలాగే జులై 27 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు ఆఫీస్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజర్ వెల్లడించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పీఎహెచ్డీ అభ్యర్థులు జులై 4వ తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలియచేశారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండీ :