ETV Bharat / briefs

భూవివాదంలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి గొడ్డలితో దాడి - భూతగాదాలు

భూవివాదాలతో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. జగిత్యాల జిల్లాలో పట్టపగలే అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది.

భూ వివాదంలో నడిరోడ్డుపై హత్యాయత్నం
author img

By

Published : Apr 15, 2019, 4:38 PM IST

భూ వివాదంలో నడిరోడ్డుపై హత్యాయత్నం

జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఇంకో వ్యక్తిపై విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేశాడు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన తిప్పర్తి కిషన్​, లక్ష్మణ్​ భూ లావాదేవీల విషయంలో రోడ్డుపై తగాదా పడ్డారు. అనంతరం లక్ష్మణ్​ తన ద్విచక్ర వాహనం నుంచి గొడ్డలి తీసి కిషన్​పై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు ఈ ఘటనను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కిషన్​ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : విశాఖలో అసిండెక్స్@19 నౌకా విన్యాసాలు

భూ వివాదంలో నడిరోడ్డుపై హత్యాయత్నం

జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఇంకో వ్యక్తిపై విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేశాడు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన తిప్పర్తి కిషన్​, లక్ష్మణ్​ భూ లావాదేవీల విషయంలో రోడ్డుపై తగాదా పడ్డారు. అనంతరం లక్ష్మణ్​ తన ద్విచక్ర వాహనం నుంచి గొడ్డలి తీసి కిషన్​పై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు ఈ ఘటనను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కిషన్​ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : విశాఖలో అసిండెక్స్@19 నౌకా విన్యాసాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.