ETV Bharat / briefs

లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండండి : చంద్రబాబు

ఎన్నికల్లో తెదేపాకు సహకరించిన ఓటర్లకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. మోదీది పాసిస్టు పాలనగా అభివర్ణించిన ఆయన దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యనించారు. ఎన్నికల్లో భాజపాకు 140 సీట్లకంటే తక్కువే వస్తాయని జోస్యం చెప్పారు.

author img

By

Published : Apr 23, 2019, 3:45 AM IST

babu

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడి, ప్రజా సమస్యలతో పాటు ఎన్నికల అనంతర పరిణామాలపై ఉండవల్లిలోని ప్రజావేదికలో పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

చంద్రబాబు
అప్రమత్తంగా ఉండండిఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ జగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే అభ్యర్ధులు, ఎంపీ అభ్యర్ధులు ప్రజాప్రతినిధులకు సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్ల్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతిపక్ష పార్టీ దౌర్జన్యాలతో పాటు ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోన్నప్పటికీ.. పార్టీ శ్రేణులు అన్నీ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశాయని అన్నారు.సబ్సిడీ ఇవ్వాల్సిందే...పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నేతలతో సమీక్షించారు. ఈసీ వైఫల్యాలు.. వీవీ ప్యాట్ ల లెక్కింపు, ఫలితాల వెల్లడి సమయానికి పార్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల సంస్కరణలు వంటి అంశాలపై నేతలతో చర్చించారు. సూక్ష్మ సేద్యానికి సంబంధించిన సబ్సీడీ రైతులకు అందడం లేదని ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఎన్నికల కోడ్ ఉన్నందున మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ ఇవ్వడం లేదని తెలియచేశారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసినందున సబ్సిడీ ఇవ్వాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీలంకదాడులను ఖండిస్తున్నాంప్రజా సమస్యలు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపచేయాలని బాబు నేతలకు సూచించారు.ఎన్నికల కోడ్‌ నెపంతో పరిపాలన కుంటుపడకూడదన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎవరన్నా రెచ్చగొట్టే ధోరణితో ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. శ్రీలంకలో జరిగిన దాడులు మానవతావాదులంతా ఖండించాలని అన్నారు. అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా ఈసీఐ ఆదేశాలు ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడి, ప్రజా సమస్యలతో పాటు ఎన్నికల అనంతర పరిణామాలపై ఉండవల్లిలోని ప్రజావేదికలో పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

చంద్రబాబు
అప్రమత్తంగా ఉండండిఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ జగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే అభ్యర్ధులు, ఎంపీ అభ్యర్ధులు ప్రజాప్రతినిధులకు సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్ల్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతిపక్ష పార్టీ దౌర్జన్యాలతో పాటు ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోన్నప్పటికీ.. పార్టీ శ్రేణులు అన్నీ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశాయని అన్నారు.సబ్సిడీ ఇవ్వాల్సిందే...పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నేతలతో సమీక్షించారు. ఈసీ వైఫల్యాలు.. వీవీ ప్యాట్ ల లెక్కింపు, ఫలితాల వెల్లడి సమయానికి పార్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల సంస్కరణలు వంటి అంశాలపై నేతలతో చర్చించారు. సూక్ష్మ సేద్యానికి సంబంధించిన సబ్సీడీ రైతులకు అందడం లేదని ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఎన్నికల కోడ్ ఉన్నందున మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ ఇవ్వడం లేదని తెలియచేశారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసినందున సబ్సిడీ ఇవ్వాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. శ్రీలంకదాడులను ఖండిస్తున్నాంప్రజా సమస్యలు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపచేయాలని బాబు నేతలకు సూచించారు.ఎన్నికల కోడ్‌ నెపంతో పరిపాలన కుంటుపడకూడదన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎవరన్నా రెచ్చగొట్టే ధోరణితో ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. శ్రీలంకలో జరిగిన దాడులు మానవతావాదులంతా ఖండించాలని అన్నారు. అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా ఈసీఐ ఆదేశాలు ఇవ్వాలన్నారు.
Intro:Ap_cdp_46_22_Rajampetalo_bhaari_varsham_Av_c7 కడప జిల్లా రాజంపేటలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన తో రాజంపేట పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. భారీ వర్షానికి రాజంపేట పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన తపాలా కార్యాలయం, మసీదు వీధి, పట్టణ పోలీస్ స్టేషన్, ఆర్టిసి బస్టాండ్ ప్రాంతాల్లో మురుగునీటితో రహదారులు సాధారణంగా ప్రధాన కాలువలు సైతం పొంగిపొర్లాయి. వర్షం నీటితో వీధులన్నీ పిల్ల కాలువలా మారాయి. రాజంపేట మండలం లోని ఆకేపాడు, కొత్తపల్లి, హస్తవరం, కొల్లవారిపల్లి, మిట్టమీదపల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకొరిగాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండి పోగా మిగిలిన పంటలు వర్షం కారణంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. వర్షం పడే సమయానికి చీకటిగా ఉండడంతో రైతులు పంట పొలాల్లో కి వెళ్ళలేదు. దీంతో ఎంత నష్టం జరిగిందనే విషయం తెలియకుంది. అక్కడక్కడ వడగళ్లు కూడా పడ్డాయి.


Body:రాజంపేట లో భారీ వర్షం


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.