ETV Bharat / bharat

భక్తులకు అలర్ట్​ - కార్తిక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 10:26 AM IST

Arjitha Seva and Abhishekam Cancelled at Srisailam During karthika Masam: కార్తికమాసంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. కార్తికమాస పర్వదినాలు, సెలవు రోజులలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని ముందస్తు ఆలోచనతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అది ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Arjitha_Seva_and_Abhishekam_Cancelled_at_Srisailam
Arjitha_Seva_and_Abhishekam_Cancelled_at_Srisailam

Arjitha Seva and Abhishekam Cancelled at Srisailam During karthika Masam: హిందువులకు కార్తిక మాసం అత్యంత పవిత్రమైనది. దీపావళి తరువాతి రోజు నుంచీ మొదలయ్యే కార్తికానికి ఎంతో ప్రత్యేకత ఉంది. చంద్రుడు పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరూ సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయి. కార్తిక సోమవారాలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

శివకేశవులను ఆరాధించే ఈ పవిత్ర మాసంలో ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా శివాలయాలకు, శైవక్షేత్రాల్లో శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్​లోని ప్రముఖ శివ క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒక్కటైనా శ్రీశైలానికి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తారు. అయితే కార్తికమాస పర్వదినాలు, సెలవు రోజులలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని ముందస్తు ఆలోచనతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

కార్తిక పౌర్ణమి.. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం

Karthika Masam Brahmotsavam 2023: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక మాసమంతా అభిషేకాలు రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ నెల 14 నుంచి డిసెంబరు 12 వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పర్వదినాలు, సెలవు రోజుల్లో అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు కార్తిక మాసంలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధ మల్లికార్జునస్వామి ఆర్జిత, అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నాలుగు విడతలుగా స్వామి వారి స్పర్శ దర్శనం: శని, ఆది, సోమవారాల్లో మల్లికార్జునస్వామి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు నాలుగు విడతలుగా రూ.500 స్పర్శ దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. స్పర్శ దర్శనం టిక్కెట్లను దేవస్థానం మొబైల్‌ యాప్‌ ద్వారా పొందాల్సి ఉంటుందన్నారు. ఆర్జిత రుద్రహోమం, చండీహోమాలను రోజుకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో సూచించారు.

హరహర మహాదేవ.. కార్తీక సోమవారం శివపూజ ఇలా చేయాలి..

27న కార్తిక పౌర్ణమి: శ్రీశైలం వచ్చే భక్తులకు కార్తికమాసంలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అన్ని అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. కార్తిక దీపారాధన భక్తులకు ఆలయ ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపాలు వెలిగించుకోవాలన్నారు. కార్తిక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటు చేయనున్నారు.. 27వ తేదీన కార్తిక పౌర్ణమి అయిన 26న పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం నిర్వహించాలని నిర్ణయించారు.

కార్తిక మాసం: మహేశ్వరుని ఆలయ మహిమలు

Arjitha Seva and Abhishekam Cancelled at Srisailam During karthika Masam: హిందువులకు కార్తిక మాసం అత్యంత పవిత్రమైనది. దీపావళి తరువాతి రోజు నుంచీ మొదలయ్యే కార్తికానికి ఎంతో ప్రత్యేకత ఉంది. చంద్రుడు పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరూ సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయి. కార్తిక సోమవారాలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

శివకేశవులను ఆరాధించే ఈ పవిత్ర మాసంలో ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా శివాలయాలకు, శైవక్షేత్రాల్లో శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్​లోని ప్రముఖ శివ క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒక్కటైనా శ్రీశైలానికి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తారు. అయితే కార్తికమాస పర్వదినాలు, సెలవు రోజులలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని ముందస్తు ఆలోచనతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

కార్తిక పౌర్ణమి.. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం

Karthika Masam Brahmotsavam 2023: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక మాసమంతా అభిషేకాలు రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ నెల 14 నుంచి డిసెంబరు 12 వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పర్వదినాలు, సెలవు రోజుల్లో అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించేందుకు కార్తిక మాసంలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధ మల్లికార్జునస్వామి ఆర్జిత, అభిషేకాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నాలుగు విడతలుగా స్వామి వారి స్పర్శ దర్శనం: శని, ఆది, సోమవారాల్లో మల్లికార్జునస్వామి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు నాలుగు విడతలుగా రూ.500 స్పర్శ దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. స్పర్శ దర్శనం టిక్కెట్లను దేవస్థానం మొబైల్‌ యాప్‌ ద్వారా పొందాల్సి ఉంటుందన్నారు. ఆర్జిత రుద్రహోమం, చండీహోమాలను రోజుకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు వివరించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో సూచించారు.

హరహర మహాదేవ.. కార్తీక సోమవారం శివపూజ ఇలా చేయాలి..

27న కార్తిక పౌర్ణమి: శ్రీశైలం వచ్చే భక్తులకు కార్తికమాసంలో ఎలాంటి ఆ సౌకర్యాలు లేకుండా అన్ని అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. కార్తిక దీపారాధన భక్తులకు ఆలయ ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపాలు వెలిగించుకోవాలన్నారు. కార్తిక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటు చేయనున్నారు.. 27వ తేదీన కార్తిక పౌర్ణమి అయిన 26న పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం నిర్వహించాలని నిర్ణయించారు.

కార్తిక మాసం: మహేశ్వరుని ఆలయ మహిమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.