రంగారెడ్ది జిల్లా హయత్నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్నేహితురాలి అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ చేశారు. పసుపులేటి స్వాతి అనే మహిళ హయత్నగర్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో నివాసం ఉంటుంది. సూర్యాపేటలో చిన్ననాటి ఫ్రెండ్ చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం మధ్యాహ్నం వెళ్లింది.
తిరిగి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి చూడగా, తాళం పగులగొట్టి ఉంది. పక్కింటి వారి సాయంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి, ఒక మొబైల్ దోపిడీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ధార్ గ్యాంగ్ పనేనా? వరుస చోరీల పట్ల స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల ఓ 3 ఇళ్లలో చోరీ జరగగా, అవి చేసింది మధ్యప్రదేశ్కు చెందిన ధార్ గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు. ఇది కూడా వారి పనేనా అనే అనుమానాలు వస్తున్నాయి.