ETV Bharat / snippets

అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు - తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 10:19 AM IST

Updated : Jun 8, 2024, 10:31 AM IST

ramoji_rao
ramoji_rao (ETV Bharat)

Telangana Govt on Ramoji Rao Last Rites: అనారోగ్య సంబంధిత సమస్యలతో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం దిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్​కు సీఎస్ ద్వారా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో రేపు ఉదయం 9 నుంచి 10 మధ్య అంత్యక్రియలు జరపనున్నారు.

Telangana Govt on Ramoji Rao Last Rites: అనారోగ్య సంబంధిత సమస్యలతో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం దిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్​కు సీఎస్ ద్వారా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో రేపు ఉదయం 9 నుంచి 10 మధ్య అంత్యక్రియలు జరపనున్నారు.

Last Updated : Jun 8, 2024, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.