Old Woman Dies in A Fight in Hanamkonda : చింతచెట్టు గొడవ కుమారుని చేతిలో తల్లి ప్రాణాలు పోవడానికి కారణమైంది. హనుమకొండ శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన మోతే తిరుపతి రెడ్డికి అదే గ్రామంలో బేతు జయపాల్ రెడ్డికి ఈ నెల 8న చింతచెట్టు విషయంలో గొడవ జరిగింది. వారిద్దరు గొడవ పడుతున్న క్రమంలో తిరుపతిరెడ్డిని అడ్డుకోడానికి ఆయన భార్య ప్రయత్నించింది.
చింతచెట్టు గొడవలో కుమారుడిని అడ్డుకోబోయి ప్రాణాలు కోల్పోయిన తల్లి
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 10, 2024, 8:04 PM IST
|Updated : Jun 10, 2024, 8:56 PM IST
![చింతచెట్టు గొడవలో కుమారుడిని అడ్డుకోబోయి ప్రాణాలు కోల్పోయిన తల్లి Mother Died in son Quarrel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-06-2024/1200-675-21680985-thumbnail-16x9-woman-dies-in-fight.jpg?imwidth=3840)
ఆగ్రహంతో తిరుపతిరెడ్డి తన భార్యపై దాడి చేస్తున్న క్రమంలో ఆయన తల్లి నరసమ్మ అడ్డుకోబోయింది. ఈ క్రమంలో నరసమ్మకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించే క్రమంలో నరసమ్మ మృతి చెందింది. దీంతో నిందితుడు తిరుపతిరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
Old Woman Dies in A Fight in Hanamkonda : చింతచెట్టు గొడవ కుమారుని చేతిలో తల్లి ప్రాణాలు పోవడానికి కారణమైంది. హనుమకొండ శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన మోతే తిరుపతి రెడ్డికి అదే గ్రామంలో బేతు జయపాల్ రెడ్డికి ఈ నెల 8న చింతచెట్టు విషయంలో గొడవ జరిగింది. వారిద్దరు గొడవ పడుతున్న క్రమంలో తిరుపతిరెడ్డిని అడ్డుకోడానికి ఆయన భార్య ప్రయత్నించింది.
ఆగ్రహంతో తిరుపతిరెడ్డి తన భార్యపై దాడి చేస్తున్న క్రమంలో ఆయన తల్లి నరసమ్మ అడ్డుకోబోయింది. ఈ క్రమంలో నరసమ్మకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించే క్రమంలో నరసమ్మ మృతి చెందింది. దీంతో నిందితుడు తిరుపతిరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.