ETV Bharat / snippets

చింతచెట్టు గొడవలో కుమారుడిని అడ్డుకోబోయి ప్రాణాలు కోల్పోయిన తల్లి

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 8:04 PM IST

Updated : Jun 10, 2024, 8:56 PM IST

Mother Died in son Quarrel
Old Woman Dies In a Fight (ETV Bharat)

Old Woman Dies in A Fight in Hanamkonda : చింతచెట్టు గొడవ కుమారుని చేతిలో తల్లి ప్రాణాలు పోవడానికి కారణమైంది. హనుమకొండ శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన మోతే తిరుపతి రెడ్డికి అదే గ్రామంలో బేతు జయపాల్​ రెడ్డికి ఈ నెల 8న చింతచెట్టు విషయంలో గొడవ జరిగింది. వారిద్దరు గొడవ పడుతున్న క్రమంలో తిరుపతిరెడ్డిని అడ్డుకోడానికి ఆయన భార్య ప్రయత్నించింది.

ఆగ్రహంతో తిరుపతిరెడ్డి తన భార్యపై దాడి చేస్తున్న క్రమంలో ఆయన తల్లి నరసమ్మ అడ్డుకోబోయింది. ఈ క్రమంలో నరసమ్మకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించే క్రమంలో నరసమ్మ మృతి చెందింది. దీంతో నిందితుడు తిరుపతిరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

Old Woman Dies in A Fight in Hanamkonda : చింతచెట్టు గొడవ కుమారుని చేతిలో తల్లి ప్రాణాలు పోవడానికి కారణమైంది. హనుమకొండ శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన మోతే తిరుపతి రెడ్డికి అదే గ్రామంలో బేతు జయపాల్​ రెడ్డికి ఈ నెల 8న చింతచెట్టు విషయంలో గొడవ జరిగింది. వారిద్దరు గొడవ పడుతున్న క్రమంలో తిరుపతిరెడ్డిని అడ్డుకోడానికి ఆయన భార్య ప్రయత్నించింది.

ఆగ్రహంతో తిరుపతిరెడ్డి తన భార్యపై దాడి చేస్తున్న క్రమంలో ఆయన తల్లి నరసమ్మ అడ్డుకోబోయింది. ఈ క్రమంలో నరసమ్మకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించే క్రమంలో నరసమ్మ మృతి చెందింది. దీంతో నిందితుడు తిరుపతిరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

Last Updated : Jun 10, 2024, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.