Hearing in TG High Court on KCRs Petition : విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆదిత్య సోంధి వాదించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం ఉందని, ఈ విషయంలో ఒకవేళ ఏవైనా వివాదాలుంటే ఈఆర్సీ వద్దే పరిష్కరించుకోవాల్సి ఉందని ఆయన కోర్టుకు తెలిపారు.
'విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ - విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు - TELANGANA HC ON KCR PE TITION
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 27, 2024, 1:11 PM IST
|Updated : Jun 27, 2024, 2:49 PM IST
!['విద్యుత్ కమిషన్పై కేసీఆర్ పిటిషన్ - విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు - TELANGANA HC ON KCR PE TITION Hearing in TG High Court on KCRs Writ Petition](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-06-2024/1200-675-21808229-thumbnail-16x9-kcr-writ-petition.jpg?imwidth=3840)
విద్యుత్ కమిషన్ విచారణ చేయడంలో తప్పేముందని నివేదికను ప్రభుత్వానికి ఇస్తే అసెంబ్లీలో చర్చిస్తారు కదా ధర్మాసనం ప్రశ్నించగా, కమిషన్ వైఖరి ని ష్పక్షపాతంగా లేదని రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం ఈ కమిషన్ వేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కేసీఆర్ తరపున వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.
Hearing in TG High Court on KCRs Petition : విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆదిత్య సోంధి వాదించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం ఉందని, ఈ విషయంలో ఒకవేళ ఏవైనా వివాదాలుంటే ఈఆర్సీ వద్దే పరిష్కరించుకోవాల్సి ఉందని ఆయన కోర్టుకు తెలిపారు.
విద్యుత్ కమిషన్ విచారణ చేయడంలో తప్పేముందని నివేదికను ప్రభుత్వానికి ఇస్తే అసెంబ్లీలో చర్చిస్తారు కదా ధర్మాసనం ప్రశ్నించగా, కమిషన్ వైఖరి ని ష్పక్షపాతంగా లేదని రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం ఈ కమిషన్ వేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కేసీఆర్ తరపున వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.