ETV Bharat / snippets

బ్రిటన్​లో మృతి చెందిన సాయిరాం మృతదేహం స్వగ్రామానికి చేరిక

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 4:05 PM IST

Sairam Dead Body Reached to Konuru
Sairam Dead Body Reached to Konuru (ETV Bharat)

Sairam Dead Body Reached to Konuru : బ్రిటన్‌లో మృతి చెందిన పల్నాడు జిల్లా కోనూరుకు చెందిన గుంటుపల్లి సాయిరాం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన సాయిరాం ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ యాజమానిని కోల్పోయిన తమకు ఇంటికి పెద్ద దిక్కుగా నిలుస్తాడనుకున్న కుమారుడు నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి తల్లడిల్లిపోతోంది.

ఈనెల 2న సాయిరాం మృతదేహాన్ని మాంచెస్టర్ బీచ్ సమీపంలో బ్రిటన్ పోలీసులు గుర్తించారు. మృతదేహాన్నిఅక్కడి నుంచి స్వదేశానికి తీసుకువచ్చేందుకు మంత్రి లోకేశ్​, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపారని గ్రామస్తులు తెలిపారు.

Sairam Dead Body Reached to Konuru : బ్రిటన్‌లో మృతి చెందిన పల్నాడు జిల్లా కోనూరుకు చెందిన గుంటుపల్లి సాయిరాం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన సాయిరాం ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ యాజమానిని కోల్పోయిన తమకు ఇంటికి పెద్ద దిక్కుగా నిలుస్తాడనుకున్న కుమారుడు నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి తల్లడిల్లిపోతోంది.

ఈనెల 2న సాయిరాం మృతదేహాన్ని మాంచెస్టర్ బీచ్ సమీపంలో బ్రిటన్ పోలీసులు గుర్తించారు. మృతదేహాన్నిఅక్కడి నుంచి స్వదేశానికి తీసుకువచ్చేందుకు మంత్రి లోకేశ్​, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపారని గ్రామస్తులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.