Ex MP Ramesh Rathod Funeral Completed : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్ అంత్యక్రియలు అభిమానుల అశ్రు నయనాల మధ్య ముగిశాయి. శనివారం అస్వస్థకు గురై హఠాన్మరణం చెందిన ఆయన అంత్యక్రియలు, ఆయన స్వస్థలం ఉట్నూర్లోని వ్యవసాయక్షేత్రంలో ఈరోజు జరిగాయి. అంతకు ముందు కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, మాజీ మంత్రులు వేణుగోపాలా చారి, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న వివిధ పార్టీ నేతలు, అధికారులు రమేశ్ రాఠోడ్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
ముగిసిన మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్ అంత్యక్రియలు
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 30, 2024, 7:57 PM IST
కడసారి చూపు కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆయన అభిమానులతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు. రమేశ్ రాఠోడ్ చితికి ఆయన పెద్ద కుమారుడు రితేశ్ రాఠోడ్ నిప్పంటించారు.
Ex MP Ramesh Rathod Funeral Completed : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్ అంత్యక్రియలు అభిమానుల అశ్రు నయనాల మధ్య ముగిశాయి. శనివారం అస్వస్థకు గురై హఠాన్మరణం చెందిన ఆయన అంత్యక్రియలు, ఆయన స్వస్థలం ఉట్నూర్లోని వ్యవసాయక్షేత్రంలో ఈరోజు జరిగాయి. అంతకు ముందు కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, మాజీ మంత్రులు వేణుగోపాలా చారి, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న వివిధ పార్టీ నేతలు, అధికారులు రమేశ్ రాఠోడ్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
కడసారి చూపు కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆయన అభిమానులతో పాటు ప్రజలు భారీగా తరలివచ్చారు. రమేశ్ రాఠోడ్ చితికి ఆయన పెద్ద కుమారుడు రితేశ్ రాఠోడ్ నిప్పంటించారు.