ETV Bharat / snippets

రైతుభరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు - ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 10:36 PM IST

Deputy CM Bhatti as Chairman of Rythu Bharosa Cabinet Sub Committee
Rythu Bharosa Cabinet Sub Committee (ETV Bharat)

Rythu Bharosa Cabinet Sub Committee : రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్​గా, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటయింది. గత నెల 22న జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం మేరకు సీఎస్ శాంతికుమారి జీవో జారీ చేశారు. రైతుభరోసా పథకానికి అర్హతలు, విధివిధానాలు, మార్గదర్శకాలను మంత్రివర్గం సిఫార్సు చేయనుంది. కమిటీ సిఫార్సులపై ఈనెలాఖరులో జరగున్న అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Rythu Bharosa Cabinet Sub Committee : రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్​గా, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటయింది. గత నెల 22న జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం మేరకు సీఎస్ శాంతికుమారి జీవో జారీ చేశారు. రైతుభరోసా పథకానికి అర్హతలు, విధివిధానాలు, మార్గదర్శకాలను మంత్రివర్గం సిఫార్సు చేయనుంది. కమిటీ సిఫార్సులపై ఈనెలాఖరులో జరగున్న అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.