AP Govt Organize Ramoji Rao Memorial Programme: రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెనమలూరులో ఈనెల 27వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఈనెల 8న కన్ను మూశారు. ఈనెల 5న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.
అధికారికంగా రామోజీరావు సంస్మరణ కార్యక్రమం- సీఎం చంద్రబాబు ఆదేశాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 3:57 PM IST
AP Govt Organize Ramoji Rao Memorial Programme: రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెనమలూరులో ఈనెల 27వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఈనెల 8న కన్ను మూశారు. ఈనెల 5న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.