ETV Bharat / snippets

మానసిక స్థితి సరిగా లేక - ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఆత్మహత్య

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 10:40 AM IST

Govt Teacher Dies By Suicide
Govt Teacher Dies By Suicide (ETV Bharat)

Govt Teacher Dies By Suicide : మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బీబీపేట్ గ్రామానికి చెందిన గాండ్ల వీణ అలియాస్ లాస్య (35) జనగామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.

శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్న వీణ, తెల్లవారుజామున ఇంటి వెనకాల ఉన్న గదిలోకి వెళ్లి విషం తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. తండ్రి రామచంద్రం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలో కూడా వీణ పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తండ్రి తెలిపారు. మృతురాలి తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు బీబీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Govt Teacher Dies By Suicide : మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బీబీపేట్ గ్రామానికి చెందిన గాండ్ల వీణ అలియాస్ లాస్య (35) జనగామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.

శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్న వీణ, తెల్లవారుజామున ఇంటి వెనకాల ఉన్న గదిలోకి వెళ్లి విషం తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. తండ్రి రామచంద్రం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలో కూడా వీణ పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తండ్రి తెలిపారు. మృతురాలి తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు బీబీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.