Paris Olympics 2024 India: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు తడబడ్డారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో పురుషుల విభాగం సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. ఈ ఈవెంట్లో టాప్- 8లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్కు అర్హత సాధిస్తారు. అయితే శనివారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో షూటర్ సరబ్జోత్ 577పాయింట్లతో 9వ స్థానం దక్కించుకున్నాడు. దీంతో త్రుటిలో ఫైనల్కు చేరే అవకాశాన్ని కోల్పోయాడు. మరోవైపు అర్జున్ చీమా 574పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమయ్యాడు.
అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్, రమిత- అర్జున్ బబుతా జోడీలు నిరాశపర్చాయి. క్వాలిఫికేషన్లో ఈ జోడీలు టాప్-4కు చేరుకోలేకపోయాయి.