Paris Olympics 2024 Indian Women Archery Team : పారిస్ ఒలింపిక్స్లో భారత్ మహిళల ఆర్చరీ టీమ్ శుభారంభం చేసింది. దీంతో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. అంకితా భకత్, భజన్ కౌర్, దీపికాకుమారి త్రయం మంచి ప్రదర్శన చేయడంతో భారత్ టాప్-4కు చేరింది. ఈ ముగ్గురమ్మాయిలు కలిసి 1983 పాయింట్లు సాధించారు. ఇదే ఈవెంట్లో కొరియా 2046 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా చైనా(1996), మెక్సికో(1986పాయింట్లు) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచాయి.
అంకిత భకత్ 666 పాయింట్లతో 11వ స్ధానంలో నిలిచి అదరగొట్టింది. భజన్ కౌర్(659 పాయింట్లు), దీపికా కుమారి(658 పాయింట్లు) వరుసగా 22, 23వ స్ధానాల్లో నిలిచారు. ఇక క్వార్టర్ ఫైనల్లో భారత్ మహిళల ఆర్చరీ జట్టు ఫ్రాన్స్ వర్సెస్ నెదర్లాండ్స్ విజేతతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇక క్వార్టర్స్ ఫైనల్లో విజయం సాధిస్తే సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాతో తలపడే ఛాన్స్ ఉంటుంది.