LIVE: బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ చేయండపై వర్ల రామయ్య మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - varla ramaiah press meet
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 3:12 PM IST
|Updated : May 4, 2024, 3:33 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-05-2024/640-480-21384547-thumbnail-16x9-varla-ramaiah.jpg)
Varla Ramaiah Press Meet: పింఛన్ పంపిణీలో ప్రభుత్వ కుట్రలకు అవ్వాతాతలు అల్లాడిపోయారు. మలమలమాడిపోయే ఎండలో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వ్దద విలవిల్లాడుపోయారు. ఇంట్లోంచి కదల్లేని వారి పరిస్థితి దయనీయంగా మారింది. పండుటాకుల్ని ప్రభుత్వం అవస్థలపాలు చేస్తోందని లబ్ధిదారులు వాపోయారు. రాజకీయాల కోసం వృద్ధులు, వికలాంగులపై ప్రభుత్వం పగబట్టినట్లుగా వ్యవహరించింది. పింఛన్ డబ్బులు ఇంటివద్దకు తెచ్చి ఇచ్చే అవకాశం ఉన్నా మండుటెండలో వారిని బ్యాంకుల చుట్టూ తిప్పింది. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ డబ్బుల కోసం అష్టకష్టాలు పడేలా చేసింది. ఉదయం నుంచే పెన్షన్ కోసం వృద్ధులు పడిగాపులు కాశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. విజయవాడలో ఫించనుదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పింఛన్ల పంపిణీలో జగన్ కుట్రకు వృద్ధులు, దివ్యాంగులు బలవుతున్నారు. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటపడుతూ పింఛన్దారుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులకు సకాలంలో డబ్బు అందక మండుటెండలో విలవిల్లాడుతున్నారు. పింఛన్ల కోసం తిరుగుతూ వడదెబ్బతో శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు పొగొట్టుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ చేయండపై వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షప్రసారం.