thumbnail

LIVE: విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Sirimanotsavam at Vizianagaram Sri Pyditalli Ammavari Temple Live : ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగర ప్రజల ఆరాధ్యదేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. సోమవారం తొలేళ్ల సంబరం వైభవంగా సాగగా ఇప్పుడు అమ్మవారి సిరిమనోత్సవం జరగనుంది. లక్షల మంది భక్తులు తరలొచ్చే ఉత్సవాల కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. సిరిమానోత్సవ నిర్వహణకు 2వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తుల కోసం 50 వేలు చొప్పున లడ్డూలు, పులిహోరా ప్యాకెట్లు సిద్ధం చేశామని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు భక్తుల సౌకర్యార్థం నగరంలోని 20 ప్రాంతాల్లో చలివేంద్రాలు పారిశుద్ధ్య పనుల కోసం అదనంగా 300 మంది కార్మికుల నియామకం జరిగింది. సిరిమానోత్సవ పర్యవేక్షణకు 2 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిమాను ఊరేగింపు జరిగే ప్రాంతంలో 80 సీసీ కెమెరాలు పెట్టించారు. అమ్మవారి ఉత్సవాలు ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.
Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.