4 కోట్లకు పైగా అప్పులు వసూలు- రాత్రికిరాత్రే ఇంటిని ఖాళీ చేసి పరార్​- లబోదిబోమంటున్న బాధితులు - Merchant cheating and excaped - MERCHANT CHEATING AND EXCAPED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 11:52 AM IST

Merchant Escaped After Cheating Villagers in Satya Sai District : వ్యాపారం పేరుతో మహేశ్వర రెడ్డి అనే వ్యక్తి అధిక వడ్డీలకు అప్పుతీసుకొని ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో కొన్ని నెలల క్రితం మహేశ్వర రెడ్డి ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అని వివిధ వ్యాపారాలు ప్రారంభించారు. రోజు వారీ వడ్డీగా లక్షకు వెయ్యి రూపాయలు చొప్పున అప్పు తీసుకునేవాడు. ఎక్కువ వడ్డీకి ఆశపడిన బాధితులు బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు ఇచ్చారు. 

సుమారు 4 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆయన రాత్రికిరాత్రే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహేశ్వర రెడ్డి ఉత్పత్తులను మార్కెట్ ధర కంటే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఆశపడిన వ్యాపారులు అత్యధికులు గొర్రెలను, వేరుశనగకాయలను మహేశ్వర్ రెడ్డికి విక్రయించారు. సుమారు 4 కోట్ల రూపాయలకు పైగా అప్పులు వసూలు చేసుకున్న ఆయన రాత్రికిరాత్రే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.