thumbnail

LIVE: శ్రీకాకుళం నియోజకవర్గం ఆడబిడ్డలతో చంద్రబాబు ముఖాముఖి - ప్రత్యక్షప్రసారం - Chandrababu Interact With Women

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 12:35 PM IST

Updated : Apr 24, 2024, 2:05 PM IST

Chandrababu Interact With Women Live: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో మహిళలతో శ్రీకాకుళంలోని ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల్లో చాలా చైతన్యం ఉందన్న చంద్రబాబు, మొదటిసారి ఆడపిల్లలను చదివించాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఉందని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. ప్రజల గుండెల్లో స్థానమే తన ఆశయమన్న చంద్రబాబు, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేదల కోసం పని చేశానని అన్నారు. ఆడపిల్లలను చదివిస్తే ఆర్థికాభివృద్ధి సాధిస్తారని, తెలుగుజాతి నెంబర్‌వన్‌గా నిలపాలన్నది తన లక్ష్యం అని పేర్కొన్నారు. మహిళలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. దీపం కింద వంటగ్యాస్‌ ఇస్తే దాన్ని వైసీపీ హయాంలో ఆర్పేశారని ధ్వజమెత్తారు. జగన్‌ రూ.10 ఇచ్చి రూ.100 బాదేస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని మండిపడ్డారు. కుంభకోణాలు జరిగితే ప్రజలంతా బానిసలుగా ఉండాల్సి వస్తుందన్న చంద్రబాబు, టీడీపీ అధకారంలోకి వచ్చాక పేదరిక నిర్మూలనకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలోని ఆడబిడ్డలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం ప్రత్యక్షప్రసారం. 
Last Updated : Apr 24, 2024, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.