'ముందస్తు పరీక్షలతో క్యాన్సర్​ నియంత్రణ సాధ్యం- ఆహార అలవాట్లలో మార్పులు తప్పనిసరి' - Cancer Specialist Noori Dattatreya

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 12:42 PM IST

thumbnail
'ముందస్తు పరీక్షలతో క్యాన్సర్​ నియంత్రణ సాధ్యం- ఆహార అలవాట్లలో మార్పులు తప్పనిసరి' (ETV Bharat)

F2F With Cancer Specialist Noori Dattatreya in East Godavari : క్యాన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే 98 శాతం నయం అవుతుందని ప్రఖ్యాత క్యాన్సర్‌ నిపుణుడు నోరీ దత్తాత్రేయుడు అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో దైనందిన జీవితాన్ని కొనసాగించవచ్చని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్​ఎల్​(GSL) వైద్యకళాశాల, జనరల్‌ ఆసుపత్రిలో డాక్టర్స్‌ డే సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన ఈటీవీ, ఈటీవీ భారత్​తో మాట్లాడారు. వంశపారంపర్య లక్షణాలు, రోజుల తరబడి తగ్గని వ్యాధులను గుర్తించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

దేశంలో క్యాన్సర్​తో రోజూ 1600 మంది దాకా చనిపోతున్నారని నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ఇందులో 200 మంది దాకా మహిళలు ఉన్నారని తెలిపారు. అనేక సార్లు వాడిన వంటనూనెలు మరల వినియోగించడం వల్ల కూడా క్యాన్సర్​ రావడానికి కారణం కావచ్చు అని పేర్కొన్నారు. క్యాన్సర్​ బారిన పడకుండా రోజూ కూరగాయలు, ఆకు కూరలను బాగా వినియోగించాలని సూచించారు. కాన్సర్​ నిర్మూలన అంటే జబ్బు వచ్చాక తగ్గించుకోవడం మాత్రమే కాదు, రాకముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. క్యాన్సర్​పై అవగాహన పెంచుకుని ఎప్పటికప్పుడు స్క్రీనింగ్​ పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.