కోటి మందిని బీజేపీలో సభ్యులుగా చేర్చడమే లక్ష్యం: పురందేశ్వరి - BJP Membership Drive

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 3:50 PM IST

thumbnail
కోటి మందిని పార్టీలో సభ్యులుగా చేర్చాలనేదే బీజేపీ లక్ష్యం: పురందేశ్వరి (ETV Bharat)

BJP Membership Drive Workshop in Vijayawada: రాష్ట్రంలో కోటి మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలనేదే లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. 2019 తర్వాత జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో పురందేశ్వరి అధ్యక్షతన పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాల నిర్వహించారు. 2024 సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబరు ఒకటి నుంచి లాంఛనంగా ప్రారంభం కానుందని ఆమె తెలిపారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యదర్శి అరవిందమీనన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి సిద్దార్ధనాథ్‌ సింగ్‌ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. 

రెండు దశల్లో జరిగే ఈ సభ్యత్వ నమోదుకు కేవలం 45 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు. అన్ని జిల్లాల నుంచి సభ్యత్వ నమోదు కమిటీల ప్రతినిధులు, జిల్లా ఇన్‌ఛార్జిలు, ప్రజాప్రతినిధులను ఈ కార్యశాలకు ఆహ్వానించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమ లోగోను పురందేశ్వరి ఆవిష్కరించారు. మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని పురందేశ్వరి పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కోసం 8800002024కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.